ఏపీ రాజకీయాలలో రానున్న రోజులలో అత్యంత కీలక పరిణామాలు సంభవించనున్నాయా.. ముఖ్యంగా తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంలో దొంగే దొంగ అని అరుస్తున్న చందంగా వ్యవహరిస్తున్న వైసీపీ దూకుడుకు కళ్లెం వేసే విధంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పావులు కదుపుతోందా? ఇందు కోసం కేంద్రం సహాయాన్ని కోరుతూ ఒత్తిడి పెంచుతోందా అన్న ప్రశ్నలకు పరిశీలకుల నుంచి ఔనన్న సమాధానమే వస్తున్నది.  ఇందుకు వారు చూపుతున్న కారణాలేంటంటే.. ఒక్క రోజు వ్యవధిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ హస్తిన పర్యటనలను చూపుతున్నారు. ముందుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హస్తిన పర్యటనకు వెళ్లారు. ఈయన ఈ నెల 9న ఢిల్లీకి బయలుదేరి వెళ్లి, ఆ మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 10న హస్తినలో కేంద్ర మంత్రులతో వరుస భేటీలతో బిజీబిజీగా గడిపారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్ సహా ఏడుగురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. చంద్రబాబు పర్యటన సందర్భంగానే విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టుకు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. అలాగే బుల్లెట్ కారిడార్ ల విషయంలో అమరావతికి రెండు బుల్లెట్ రైళ్లు అన్న ఏపీ ముఖ్యమంత్రి ప్రతిపాదనకు విత్త మంత్రి నిర్మలా సీతారామన్ సానుకూలంగా స్పందించారు.  చంద్రబాబు మంత్రులతో వరుస భేటీల తరువాత  అదే రోజు సాయంత్రం తిరుగు ప్రయాణం అయ్యారు. ఆ మరుసటి రోజే రాత్రి లోకేష్ హస్తినకు చేరుకున్నారు.

అంటే చంద్రబాబు ఇలా రాగానే.. లోకేష్ అలా హస్తినలో అడుగు పెట్టారు. హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. అంతకు ముందు  చంద్రబాబు కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో దాదాపు గంటకు పైగా చర్చించారు. ఇరువురి మధ్యా ముఖాముఖీగా జరిగిన ఈ భేటీ సారాంశంపై రాజకీయవర్గాలలో విస్తృత చర్చ జరుగుతోంది.  ఆ భేటీ పూర్తయిన గంటల వ్యవధిలోనే లోకేష్ అమిత్ షాను కలవడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ మావేశాలు జరుగుతున్నప్పటికీ మంత్రి లోకేష్ హస్తినలో మెరుపు పర్యటన జరపడం.. కేంద్ర హోంమంత్రితో భేటీ కావడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. సరిగ్గా దాదాపు ఇదే సమయంలో తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంలో సిట్ దర్యాప్తునకు తోడుగా, ఆ వ్యవహారంలో పెద్ద ఎత్తున మనీలాండరింగ్ జరిగిందన్న ఆరోపణలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగడంతో రానున్న రోజులలో తిరుమల లడ్డూ  తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక చర్యలకు ఆస్కారం ఉందన్న చర్చ రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున జరుగుతోంది.   

మరోవైపు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 మాసాలు అయిన తరువాత కూడా.. వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలపై ఉదాశీనంగా వ్యవహరించడంపై కూటమి శ్రేణుల నుంచే తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతుండటం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతోంది. ఈ నేపథ్యంలోనే ఇక చర్యలకు శ్రీకారం చుట్టడానికి కూటమి ప్రభుత్వం సమాయత్తమవుతున్నదనడానికి ఈ పర్యటనలు, భేటీలను పలువురు పార్టీ నేతలు, రాజకీయ పరిశీలకులు సంకేతంగా చెబుతున్నారు. ఇక ఏపీ రాష్ట్రంలో ఏం సంచలనాలు జరుగుతాయో మరి చూడాలి.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

12-30-53-0853.jpg

మూడు దశాబ్దాల కలకు జలాభిషేకం.. వెలిగొండకు మహా ముహూర్తం.. ఆగస్టు 31.. ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంలో మరో కీలక మైలురాయి. 
2026-08-26 Time: 12:30:53

16-45-41-0841.jpg

రూ.10వేల కోట్ల పెట్టుబడి.. 4వేల మందికి ఉద్యోగాలు.. రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. 
2026-08-25 Time: 04:45:41

13-31-48-0848.jpeg

18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే..  రౌండ్లోబుల్ సమావేశం తీర్మానం
2026-08-21 Time: 01:31:48

18-21-03-0803.jpg

అమరావతి నిర్మాణంలో మొదటి మెట్టు..  స్టీల్ బ్రిడ్జి, సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
2026-08-13 Time: 06:21:03

18-10-22-0822.jpg

కన్నా సేవలు చిరస్మరణీయం.. అమరావతి రాజధాని కోసం విశేష కృషి.. అభినందన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి 
2026-08-13 Time: 06:10:22

Related Videos