కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై కేసు నమోదైంది. గురువారం ఉదయం పార్లమెంటు ప్రాంగణంలో చోటు చేసుకున్న ఘటన నేపథ్యంలో బీజేపీ ఎంపీలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తమ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలకు గాయాలు కావడానికి రాహుల్ గాంధీనే బాధ్యుడని ఆరోపిస్తూ బీజేపీ ఎంపీలు హేమంగ్ జోషి, అనురాగ్ ఠాకూర్, బాన్సురీ స్వరాజ్ పార్లమెంట్ స్ట్రీట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద రాహుల్పై కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
పార్లమెంట్ ప్రాంగణంలో గురువారం ఉదయం బీజేపీ, కాంగ్రెస్ ఎంపీల మధ్య తోపులాట చోటు చేసుకోవడంతో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా ప్రతిపక్ష ఎంపీలు ఆందోళన చేపట్టడం... అదే సమయంలో అంబేద్కర్ను అవమానించింది కాంగ్రెస్ పార్టీనే అంటూ అధికార బీజేపీకి చెందిన సభ్యలు కూడా నిరసనలకు దిగడం.. ఇరువర్గాల పోటాపోటీ నిరసనలు జరగటంతో పార్లమెంట్ ఆవరణలో కొంత ఉద్రిక్తత వాతావరణ ఏర్పడింది. ఈ క్రమంలో చోటు చేసుకున్న తోపులాటలో బీజేపీకి చెందిన ఇద్దరు ఎంపీలు తీవ్రంగా గాయపడ్డారు. రాహుల్ తోసివేయడం వల్లే వారు గాయపడ్డారని, ఆయనపై కేసు నమోదు చేయాలని బీజేపీ ఫిర్యాదు చేసింది.
దీనిపై రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ నేతలు ఇప్పుడు మళ్లీ కొత్త డ్రామా మొదలుపెట్టారంటూ విమర్శించారు. అంబేద్కర్ విగ్రహం నుంచి తాము శాంతియుతంగా పార్లమెంట్ వైవు వచ్చామని.. పార్లమెంట్ మెట్ల దగ్గర బీజేపీ ఎంపీలు తమను అడ్డుకున్నారని... అయినా తాము ఎలాంటి దాడులకు పాల్పడలేదని రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ నేతలు చెప్పారు. మరోవైపు బీజేపీ ఎంపీలపై కూడా కాంగ్రెస్ ఎంపీల బృందం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన పై విచారణ జరపాలని కోరుతూ స్పీకర్ ఓం బిర్లా కు లేఖ రాశారు కాంగ్రెస్ ఎంపీలు.
ఇదిలావుండగా పార్లమెంటు వద్ద ఘర్షణ జరిగిన నేపథ్యంలో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా సంచలన నిర్ణయం తీసుకున్నారు.. పార్లమెంట్ ప్రవేశద్వారాల వద్ద నిరసన ప్రదర్శనలను నిషేధించారు . నిన్న అధికార , విపక్షాల సభ్యుల మధ్య జరిగిన తోపులాట నేపథ్యంలో ఈ నిర్ణయం స్పీకర్ తీసుకున్నారు. ఏ ప్రవేశ ద్వారం వద్ద ఎలాంటి నిరసన ప్రదర్శనలు చేయరాదని ఎంపీలందరికీ ఆదేశాలు జారీ చేశారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos