అజిత్ పవార్ మరణం మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక శకాన్ని ముగించింది. తన బాబాయ్ శరద్ పవార్ నీడలో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించినప్పటికీ.. తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకుని 'దాదా'గా గుర్తింపు పొందారు. అజిత్ పవార్ 22 జులై 1959న అహ్మద్‌నగర్ జిల్లాలో జన్మించారు. ఆయన తండ్రి అనంత్‌రావు పవార్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండేవారు. 1982లో శరద్ పవార్ ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చారు. తొలుత చక్కెర సహకార పరిశ్రమలో బాధ్యతలు చేపట్టారు. 1991లో బారామతి నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. అయితే బాబాయ్ శరద్ పవార్ కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లేందుకు తన ఎంపీ సీటును త్యాగం చేసి, రాష్ట్ర రాజకీయాలపై దృష్టి సారించారు.

అజిత్ పవార్ తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో అప్రతిహత విజయాలను అందుకున్నారు. 1995 నుంచి 2024 వరకు వరుసగా ఏడుసార్లు బారామతి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మహారాష్ట్ర రాజకీయ చరిత్రలో ఆరుసార్లు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఏకైక నేతగా రికార్డు సృష్టించారు. విలాస్‌రావ్ దేశ్‌ముఖ్, సుశీల్ కుమార్ షిండే, పృథ్వీరాజ్ చవాన్, దేవేంద్ర ఫడ్నవీస్, ఉద్ధవ్ థాకరే, ఏక్‌నాథ్ షిండేల హయాంలో మంత్రిగా, డిప్యూటీ సీఎంగా పనిచేశారు. కాగా 2022లో శరద్ పవార్ తన కుమార్తె సుప్రియా సూలేను రాజకీయ వారసురాలిగా ముందుకు తీసుకురావడంతో అజిత్ పవార్ అసంతృప్తికి లోనయ్యారు. 2023లో ఎన్సీపీ పార్టీలోని మెజారిటీ ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీ-శివసేన (షిండే) ప్రభుత్వంలో చేరారు. పార్టీ పేరును, గుర్తును (గడియారం) దక్కించుకుని తాను నిజమైన ఎన్సీపీ వారసుడినని నిరూపించుకున్నారు. 2024 ఎన్నికల్లో కూడా తన బలాన్ని చాటుకున్నారు. అజిత్ పవార్‌కు భార్య సునేత్రా పవార్, ఇద్దరు కుమారులు పార్త్ పవార్, జయ్ పవార్ ఉన్నారు. తన తండ్రి మరణం తర్వాత చదువు మధ్యలోనే ఆపేసిన అజిత్ పవార్, పట్టుదలతో రాష్ట్ర రాజకీయాల్లో అత్యున్నత స్థాయికి ఎదిగారు. అజిత్ పవార్ అకాల మరణం మహారాష్ట్ర రాజకీయాలకు తీరని లోటు. ఆయన మృతి పట్ల దేశవ్యాప్తంగా రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos