బ్యాంకుకు సంబంధించిన ఏదైనా పని పూర్తి చేయాల్సి వస్తే, శుక్రవారం అంటే మార్చి 21 నాటికి దాన్ని పూర్తి చేసుకోండి. దీని తర్వాత మార్చి 22 నుండి 25 వరకు బ్యాంకులు పనిచేయవు. మార్చి 26న బ్యాంకులు తెరుచుకుంటాయి. శనివారం 22, ఆదివారం 23 తేదీలలో బ్యాంకులు మూసి ఉంటాయి. దీని తర్వాత సోమవారం, మంగళవారం బ్యాంకు ఉద్యోగులు సమ్మె నిర్వహించనున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చుకునేందుకు సమ్మె నిర్వహించనున్నారు. మంగళవారం న్యూఢిల్లీలో బ్యాంకులతో ప్రభుత్వం జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగిసిన తర్వాత మార్చి 24, 25 తేదీలలో దేశవ్యాప్త సమ్మెను ప్రకటించారు. బ్యాంకుల్లో తగినంత నియామకాలు, అన్ని శాఖలలో సెక్యూరిటీ గార్డులను నియమించడం, ఐదు రోజుల బ్యాంకింగ్ పనిదినాలు, పాత పెన్షన్ పునరుద్ధరణ, అలాగే ప్రవేట్ వ్యక్తులకు వివిధ పనులను అప్పగించడం వంటి వాటికి వ్యతిరేకంగా బ్యాంకు ఉద్యోగులు నిరసన తెలుపుతున్నారు. దీనితో పాటు, కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్ధీకరించాలనే డిమాండ్లపై బ్యాంకు ఉద్యోగులు సమ్మెలోకి దిగనున్నారు.

కాగా బ్యాంకులు వరుసగా నాలుగు రోజులు మూసివేయడం వల్ల దేశం పెద్ద ఆర్థిక నష్టాన్ని చవిచూడటం ఖాయం. దీని కారణంగా ప్రభుత్వంతో పాటు సామాన్యుల పని కూడా ప్రభావితమవుతుంది. బ్యాంకుల నాలుగు రోజుల సమ్మె దేశంలో వ్యాపార కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ప్రతిరోజూ వ్యాపారులు, సేవా ప్రదాతలు, కార్పొరేట్ సంస్థలు, పరిశ్రమలు, చిన్న వ్యాపారాలు, ఇతర రంగాలు బ్యాంకింగ్ వ్యవస్థను ఉపయోగిస్తున్నాయి. ఇది వారి బ్యాంకింగ్ కార్యకలాపాలపై చెడు ప్రభావం చూపుతుంది. బ్యాంకులు మూసివేయడం వల్ల NEFT ద్వారా లావాదేవీలు నిలిచిపోతాయి. దీని కారణంగా భారీ నష్టాలు సంభవించే అవకాశం ఉంది. ఈ సమ్మె కారణంగా చెక్కుల క్లియరెన్స్, ఏటీఎం పనితీరుతో సహా అనేక ముఖ్యమైన సేవలు ప్రభావితమవుతాయి. మీడియా నివేదికల ప్రకారం.. బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ అసోసియేషన్ యుపి ప్రావిన్షియల్ జనరల్ సెక్రటరీ అనంత్ మిశ్రా మాట్లాడుతూ.. అన్ని బ్యాంకుల ఉమ్మడి సంస్థ అయిన యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ అఖిల భారత సమ్మెకు పిలుపునిచ్చిందని అన్నారు. అయితే ఈ సమయంలో యూపీఐ, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం సేవలు యథావిధిగా కొనసాగుతాయి.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos