ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు హైకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో సీబీఐ తనను అరెస్ట్ చేయడాన్ని ఆయన సవాల్ చేశారు. అయితే ఈ అరెస్ట్ను హైకోర్టు సమర్థించింది. కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ నేతృత్వంలోని ధర్మాసనం ఈరోజు కొట్టివేసింది.సరైన కారణాలు లేకుండా సీబీఐ అరెస్ట్ చేసిందని చెప్పడానికి ఆధారాలు లేవని పేర్కొంది. బెయిల్ కోసం చేసుకున్న దరఖాస్తును కూడా హైకోర్టు కొట్టివేసింది. అయితే బెయిల్ కోసం ట్రయల్ కోర్టులో దరఖాస్తు చేసుకోవచ్చునని సూచించింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై తొలుత ఈడీ కేజ్రీవాల్ను మార్చి 21న అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఆయనకు ఊరట లభించినప్పటికీ సీబీఐ అరెస్ట్ విషయంలో జైల్లోనే ఉండిపోయారు. ఈడీ కేసులో జులై 12న ఆయనకు బెయిల్ లభించింది.
కాగా మరో కేసులో సుప్రీంకోర్టు లో కేజ్రీ వాల్ కు ఆమ్ ఆద్మీ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ (ఎంసీడీ) సభ్యులను నామినేటెడ్ చేసే అధికారం లెఫ్టినెంట్ గవర్నర్కు ఉందని సుప్రీంకోర్టు సోమవారం స్పష్టం చేసింది. ఎంసీడీలో 10 మంది సభ్యులను మంత్రి మండలి సలహా మేరకు నామినేట్ చేయాలంటూ ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం... ఈ నామినేషన్ అంశంలో స్థానిక ప్రభుత్వం సలహా అవసరం లేదని, ఎల్జీకి చట్టం ప్రకారం అధికారాలు ఉన్నాయని తెలిపింది.
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ నుంచి ఈ అధికారం ఎల్జీకి వచ్చిందని, కాబట్టి ఎల్జీ స్థానిక ప్రభుత్వ సలహాను పాటించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఆయనకు చట్టం ప్రకారం అధికారం ఉన్నట్లు తెలిపింది. 2022 డిసెంబర్లో జరిగిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది. మొత్తం 250 వార్డులకు గాను ఆ పార్టీ 134 స్థానాలను దక్కించుకుంది. అయితే లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా నియమించిన 10 మంది కౌన్సిలర్ల చేత ప్రిసైడింగ్ అధికారి ప్రమాణం చేయించడం వివాదానికి కారణమైంది. ఈ వ్యవహారంపై ఆమ్ ఆద్మీ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విచారణ అనంతరం నేడు తీర్పును వెలువరించింది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos