సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ బీఆర్ గవాయ్పై దాడి చేసినందుకు తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని న్యాయవాది రాకేశ్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్లోని ఓ విష్ణుమూర్తి విగ్రహానికి సంబంధించిన పిటిషన్పై సీజేఐ చేసిన వ్యంగ్య వ్యాఖ్యలు తనను తీవ్రంగా బాధించాయని, అందుకే ఈ చర్యకు పాల్పడ్డానని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ ఆయన ఈ మేరకు వివరణ ఇచ్చారు. సెప్టెంబర్ 16న మధ్యప్రదేశ్‌లోని జవారీలో ఉన్న ఏడడుగుల విష్ణుమూర్తి విగ్రహం పునరుద్ధరణపై సీజేఐ ముందుకు పిటిషన్ విచారణకు వచ్చిందని రాకేశ్ కిశోర్ గుర్తుచేశారు. ఆ సమయంలో "వెళ్లి మీ దేవుడినే ఏదైనా చేయమని అడగండి" అంటూ సీజేఐ వ్యాఖ్యానించడం తనను కలచివేసిందన్నారు. "న్యాయం చేయకపోయినా పర్వాలేదు కానీ, నమ్మకాలను ఎగతాళి చేయకూడదు. పిటిషన్‌ను తిరస్కరించడం అన్యాయమని" ఆయన పేర్కొన్నారు. తాను హింసకు వ్యతిరేకినని, అయితే ఒక సాధారణ పౌరుడు ఎందుకిలా చేశాడో ఆలోచించాలని అన్నారు. "నేను ఏ మత్తులోనూ లేను. ఆయన చర్యకు ఇది నా ప్రతిస్పందన మాత్రమే. నాకు భయం లేదు, పశ్చాత్తాపం లేదు. క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు. ఆ దేవుడే ఈ పని  చేయించాడు. నన్ను జైలుకు పంపినా, ఉరితీసినా అది ఆయన చిత్తమే" అని రాకేశ్ కిశోర్ వ్యాఖ్యానించారు. సనాతన ధర్మం, గుర్తింపు ప్రమాదంలో ఉన్నాయని, ప్రజలు తమ హక్కుల కోసం ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.

తనను బార్ కౌన్సిల్ సస్పెండ్ చేయడంపైనా రాకేశ్ కిశోర్ స్పందించారు. న్యాయవాదుల చట్టంలోని సెక్షన్ 35 ప్రకారం, క్రమశిక్షణా కమిటీని ఏర్పాటు చేసి, నోటీసు ఇచ్చి, తన వాదన విన్న తర్వాతే చర్యలు తీసుకోవాలని, కానీ బార్ కౌన్సిల్ ఆ నిబంధనలను ఉల్లంఘించిందని ఆయన ఆరోపించారు. మరోవైప ..  సీజేఐపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ మంగళవారం సుప్రీంకోర్టు ఎదుట నిరసన తెలిపింది. ఇది న్యాయవ్యవస్థపై జరిగిన దాడిగా అభివర్ణించింది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos