మహిళల వన్డే ప్రపంచకప్‌లో చారిత్రక విజయం సాధించి, తొలిసారి కప్పును ముద్దాడిన భారత జట్టు సభ్యులు ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు. ఐసీసీ మెగా టోర్నీ విజేతలుగా నిలిచిన హర్మన్‌ప్రీత్ కౌర్ సేన బుధవారం ఢిల్లీలో ప్రధానితో సమావేశం కానున్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ చారిత్రక విజయాన్ని పురస్కరించుకుని బీసీసీఐ జట్టుకు రూ. 51 కోట్ల భారీ నగదు బహుమతిని ప్రకటించింది. ఆదివారం నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శన చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్, 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' షఫాలీ వర్మ (87) అద్భుత ఇన్నింగ్స్, 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' దీప్తి శర్మ (58) మెరుపులతో 7 వికెట్లకు 298 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్ట్ (101) శతకంతో పోరాడినా, భారత బౌలర్ల ధాటికి తలవంచక తప్పలేదు. ముఖ్యంగా దీప్తి శర్మ 5 వికెట్లతో సత్తా చాటడంతో దక్షిణాఫ్రికా 246 పరుగులకే ఆలౌట్ అయింది. దీప్తి ఆఖరి వికెట్ తీయగానే దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. భారత సీనియర్ మహిళల జట్టుకు ఇదే తొలి ఐసీసీ ట్రోఫీ కావడంతో ఈ విజయం మరింత ప్రత్యేకంగా నిలిచింది.

ప్రస్తుతం నవీ ముంబైలో ఉన్న క్రీడాకారిణులు, సహాయక సిబ్బంది మంగళవారం సాయంత్రం ఢిల్లీకి బయల్దేరనున్నారు. ప్రధానితో సమావేశం అనంతరం వారు తమ స్వస్థలాలకు వెళతారు. జట్టుకు ప్రకటించిన రూ. 51 కోట్ల నగదు బహుమతిని క్రీడాకారులు, సహాయక సిబ్బంది, ఐదుగురు సభ్యుల జాతీయ సెలక్షన్ కమిటీకి పంపిణీ చేయనున్నట్లు తెలుస్తోంది.  లీగ్ దశలో వరుసగా మూడు ఓటముల తర్వాత అద్భుతంగా పుంజుకున్న టీమిండియా, సెమీఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాపై 339 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత ఫైనల్లోనూ అదే జోరు కొనసాగించి, స్వదేశంలో అభిమానుల మధ్య టైటిల్ గెలిచి దశాబ్దాల నిరీక్షణకు తెరదించింది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Take Oath As A TDP National Working President | CM Chandrababu | AG

తాజా వార్తలు

14-55-06-0506.jpg

అమరావతిలో పుంగోల్ తరహా ఇంటిగ్రేటెడ్ టౌన్ షిప్..! జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ కమిటీ సమావేశంలో మంత్రి లోకేష్
2026-05-11 Time: 02:55:06

12-21-39-0539.jpg

ఏపీకి మరో దిగ్గజ సంస్థ.. శ్రీసిటీలో క్యారియర్ ఏసీ పరిశ్రమకు శంకుస్థాపన చేసిన మంత్రి లోకేష్
2026-05-06 Time: 12:21:39

16-17-06-0506.jpg

విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు..!రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందన్న సీఎం చంద్రబాబు
2026-05-05 Time: 04:17:06

12-32-49-0449.jpg

డిసెంబర్ నాటికి అన్ని ప్రభుత్వ సేవలూ ఆన్‌లైన్.. ఆర్టీజీ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశం
2026-04-30 Time: 12:32:49

10-50-59-0459.jpg

మీ త్యాగాలతోనే నేను ఈ స్థాయికి వచ్చాను.. టీడీపీ నూతన కార్యవర్గం ప్రమాణస్వీకార ముగింపు సభలో నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ 
2026-04-30 Time: 10:50:59

Related Videos