బీహార్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ మంగళవారం ఉదయం నుంచే జోరుగా సాగుతోంది. తొలి దశ సరళిలోనే రెండో విడతలోనూ ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. పోలింగ్ సరళిని బట్టి చూస్తే, సాయంత్రం ముగిసేసరికి సరికొత్త రికార్డు నమోదయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.మధ్యాహ్నం 1 గంట సమయానికే 47 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. ఇదే సమయానికి తొలి దశలో నమోదైన ఓటింగ్ శాతంతో పోలిస్తే ఇది దాదాపు 5 శాతం అధికం. దీంతో రెండో దశలోనూ రికార్డు స్థాయిలో ఓట్లు పోలవుతాయన్న అంచనాలు బలపడుతున్నాయి. ఎన్నికల సంఘం అధికారిక లెక్కల ప్రకారం గయ, జమూయి, బంకా జిల్లాల్లో 50 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. తూర్పు, పశ్చిమ చంపారన్, పూర్నియా, కతిహార్ వంటి ఇతర జిల్లాల్లోనూ 48 శాతానికి పైగా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బెంగాల్ సరిహద్దులో ఉన్న, ముస్లిం జనాభా అధికంగా ఉండే కిషన్‌గంజ్ జిల్లాలో మధ్యాహ్నం 1 గంటకే అత్యధికంగా 51.86 శాతం పోలింగ్ నమోదవడం విశేషం.

మంగళవారం ఉదయం పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచే పలు జిల్లాల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు, ముఖ్యంగా మహిళలు బారులు తీరారు. ఉదయం 9 గంటలకే దాదాపు 15 శాతం ఓటింగ్ నమోదైంది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత బీహార్‌లో ఎన్నడూ లేని విధంగా తొలి దశలో 64.49 శాతం పోలింగ్ నమోదై, పాత రికార్డులన్నింటినీ బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. ఈ రికార్డు స్థాయి ఓటింగ్ సరళి ఎన్నికలను మరింత ఆసక్తికరంగా మార్చడమే కాకుండా, రాజకీయ పార్టీలలో సైతం ఉత్కంఠను పెంచుతోంది. ఇది ప్రభుత్వ వ్యతిరేక పవనాలకు సంకేతమని ప్రతిపక్షాలు భావిస్తుండగా, నితీశ్ నేతృత్వంలోని డబుల్ ఇంజిన్ ప్రభుత్వ పాలనకు ప్రజలు ఇస్తున్న మద్దతు ఇదని అధికార కూటమి ధీమా వ్యక్తం చేస్తోంది. ఈసారి ఎన్నికల సంఘం తొలిసారిగా పోలింగ్ బూత్‌ల వద్ద వైద్య కేంద్రాలు, మొబైల్ ఫోన్ నిల్వ సౌకర్యాలు వంటివి ఏర్పాటు చేయడం కూడా చర్చనీయాంశమైంది. అయితే, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కింద ఓటరు ధృవీకరణను చాలా హడావుడిగా పూర్తి చేశారని, ఇది ఓటర్ల హక్కులను హరించడమేనని ప్రతిపక్షాలు ఎన్నికల సంఘంపై ఆరోపణలు చేశాయి.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos