అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లు పరిశీలన కోసం కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర పర్యటనకు వచ్చింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజ్ కుమార్  సారధిలోని 17 మంది అధికారుల బృందం హైదరాబాద్ లో రాష్ట్రంలో పలు

జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతలతో విడివిడిగా సమావేశమై చర్చించింది. ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించిన తరువాత సంక్షేమ పథకాల ప్రకటన, ఓటర్లను ప్రలోభపెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని కట్టడి చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ముందుగా నియోజకవర్గాల వారిగా ఓటర్ల జాబితా అందించాలని విజ్ఞప్తి చేశాయి. అలాగే..ఎన్నికల్లో డబ్బు, మద్యం వంటి ప్రలోభాలపై చర్యలు తీసుకోవాలని కోరాయి. ఓటరు జాబితాలో మార్పులు చేర్పులు పారదర్శకంగా ఉండేలా పర్యవేక్షించాలని డిమాండ్ చేశారు.  అత్యంత పారదర్శకంగా ఓటింగ్ జరిగేలా శాంతి భద్రతలను కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షించాలని కొన్ని పార్టీలు విజ్ఞప్తి చేశాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ డబ్బుతో ఓట్ల కొనుగోలు ప్రయత్నాలు ఆపాలని కోరినట్లు తెలిపారు. దరఖాస్తులన్నీ పరిష్కరించే వరకు ఓటర్ల తుది జాబితా ప్రకటించవద్దని కోరినట్లు చెప్పారు. ఎన్నికల సందర్భంగా కేంద్ర బలగాలను పెద్ద సంఖ్యలో రంగంలోకి దింపాలని ఎక్కువ మంది పరిశీలకులను నియమించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి తప్పులు చేస్తోందని ఈసీ దృష్టికి తీసుకువచ్చినట్లు బీజేపీ నేత మర్రి శశిధర్ రెడ్డి చెప్పారు. బీఆర్ఎస్ ప్రతినిధి బి. వినోద్ కుమార్ మాట్లాడుతూ.. గతంలో జరిగిన తప్పుల వల్ల తమ పార్టీకి తీరని నష్టం జరిగిందని, ఈసారి అలా కాకుండా చూడాలని ఈసీ బృందానికి వివరించామని తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం  ప్రతినిధులు ఈరోజు ... దివ్యాంగ ఓటర్లకు ఏర్పాట్ల విషయమై సమీక్ష నిర్వహించనున్నారు.మూడో రోజున  మీడియాతో  మాట్లాడే అవకాశం ఉంది

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos