కొవిడ్-19 మళ్లీ విజృంభిస్తోంది. దక్షిణాసియాలో విస్తరిస్తోంది. క్రమేణా కేసుల సంఖ్య పెరుగుతోంది. భారత్‌లోనూ కరోనా వైరస్‌ కేసులు గుర్తిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో 257 యాక్టివ్‌ కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. అయితే, మరణాలు కూడా వెలుగు లోకి రావటంతో ఆందోళన మొదలైంది. కాగా.. దేశంలో కొవిడ్‌ పరిస్థితి నియంత్రణలో ఉందని, ఆందోళన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఏడాది జనవరి నుంచి మహారాష్ట్రలో ఏకంగా వందకుపైగా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. మొత్తం 6,066 స్వాబ్‌ టెస్ట్‌లు చేయగా 106 కేసులు పాజిటివ్‌గా తేలినట్లు చెప్పారు. అందులో కేవలం 101 మంది ముంబైకి చెందిన వారే ఉండటం గమనార్హం. మిగిలిన వారు థానే, పూణె, కొల్హాపూర్‌కు చెందిన వారుగా పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 52 పాజిటివ్‌ కేసులు ఉన్నట్లు వెల్లడించారు. వీరిలో 16 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. కాగా, జనవరి నుంచి రెండు కొవిడ్‌ సంబంధిత మరణాలు కూడా నమోదైనట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంగళవారం తెలిపింది. మరణించిన వారిలో ఒకరు క్యాన్సర్‌ రోగి అని పేర్కొంది. పరిస్థితిని జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నామని కేంద్రం వెల్లడించింది.

జలుబు, దగ్గుతో బాధ పడుతున్న రోగులతోపాటు ఊపిరితిత్తుల వ్యాధులకు సంబంధించిన రోగుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కేంద్రం ఆదేశించింది. ఇక.. సింగపూర్‌, చైనా, థాయ్‌లాండ్‌లో కొవిడ్‌ పెరుగుదల తీవ్రంగా ఉంది. ఏప్రిల్‌ చివరి వారంలో 11వేల కేసులు సింగపూర్‌లో నమోదు కాగా, మే మొదటి వారానికి ఆ సంఖ్య 14,000 దాటింది. హాంకాంగ్‌లో మే మొదటివారంలో 1000కిపైగా కొత్త కేసులు నమోదు కాగా 33 మంది ప్రాణాలు కోల్పోయారని రికార్డులు చెబుతున్నాయి. కొవిడ్ పై ఇప్పటినుంచే అప్రమత్తంగా ఉండాలని ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్యసమితి లోని వైద్య శాఖ అధికారులు సూచిస్తున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos