న్యూస్ : కేరళలోని వయనాడ్‌ జిల్లాలో ఇటీవల కొండచరియలు విరిగిపడటంతో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. అయితే ఈ విలయం నుంచి తప్పించుకునేందుకు కొందరు గిరిజనులు వయనాడ్‌ కొండపైకి ఎక్కారు. గుహలో తలదాచుకున్న వారంతా అక్కడ చిక్కుకుపోయారు. ఈ విషయం తెలుసుకున్న కేరళ అటవీ శాఖ అధికారుల బృందం పెద్ద సాహసం చేసింది. కల్పేట రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ కే హషీష్ నేతృత్వంలోని నలుగురు సభ్యులు నాలుగున్నర గంటలపాటు నడిచి ఆ కొండపైకి చేరుకున్నారు. లోయకు ఎదురుగా కొండపై ఉన్న గుహలో చిక్కుకున్న తన పిల్లలు, భర్తకు ఆహారం కోసం అక్కడ తిరుగుతున్న మహిళ, ఆమె నాలుగేళ్ల చిన్నారిని అటవీ శాఖ బృందం గుర్తించారు. దాదాపు 8 గంటలకుపైగా కొండ, అటవీ ప్రాంతంలో నడిచి ఏడాది నుంచి నాలుగేళ్ల వయస్సున్న నలుగురు పిల్లలు, భార్యాభర్తలతో కూడిన ఒక గిరిజన కుటుంబాన్ని వారు కాపాడారు. వయనాడ్‌లోని పానియా గిరిజన కమ్యూనిటీకి చెందిన కుటుంబమని ఫారెస్ట్‌ అధికారి హషీష్ తెలిపారు. గిరిజన కుటుంబాన్ని కాపాడిన అటవీ శాఖ అధికారుల సాహసాన్ని సీఎం విజయన్‌ ప్రశంసించారు. ఈ రెస్క్యూ ఆపరేషన్‌కు సంబంధించిన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos