ఏపీ సమీపంలోని పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం ఏర్పడిన క్రమంలో... రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చే మూడురోజులపాటు పలుజిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మూడు రోజులు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 4వ తేదీ వరకు వాయవ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో మరో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉన్నందున... వీటి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో 2, 3,4 తేదీల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని, ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ లోని ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. దక్షిణ కోస్తాలోని కొన్ని జిల్లాల్లోనూ, రాయలసీమలోనూ తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వివరించారు. రాయలసీమలో ముఖ్యంగా సత్యసాయి, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో వర్షాలు పడనున్నాయి. అదేవిధంగా... ఉత్తరాంధ్ర జిల్లాల్లో మారేడుమిల్లి - రంపచోడవరం - పోలవరం - యేలేశ్వరం ప్రాంతాల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. కాగా... ఆగస్టు లో హైదరాబాద్ తోపాటు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. అయితే, సెప్టెంబర్ లో మాత్రం వర్షాలు బాగా కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ వర్షాకాల సీజన్ లోనే వర్షాలు తక్కువగా ఉన్నాయని.. మొత్తంగా చూసుకుంటే సాధారణ వర్షపాతమే నమోదైందని పేర్కొంది. అయితే, సెప్టెంబర్ నెలలో మాత్రం చాలా ప్రాంతాల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos