బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులకు నటి హేమ షాక్ ఇచ్చారు. బెంగళూరు పోలీసుల ముందు విచారణకు హాజరు కావలసి ఉన్న హేమ విచారణకు డుమ్మా కొట్టారు. ఈ మేరకు ఆమె పోలీసులకు లేఖ రాశారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో మొత్తం 86 మందికి విచారణకు రావాలని నోటీసులు పంపించిన పోలీసులు ... నటి హేమతో పాటు 8 మందికి విచారణకు రావాలని ఇదివరకే నోటీసులు పంపారు. ఈ క్రమంలో నటి హేమ సోమవారం బెంగళూరు పోలీసుల ముందు హాజరు కావలసి ఉంది. అయితే హేమ పోలీసుల ముందు హాజరు కాకుండా పోలీసులకు ఒక లేఖ రాశారు. తాను వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నానని చెప్పిన నటి హేమ ఇప్పుడు తాను విచారణకు హాజరు కాలేనని లేఖలో పేర్కొన్నారు. విచారణకు హాజరు కావటానికి సమయం కావాలన్నారు. ఈ లేఖను బెంగళూరు సిసిబి పోలీసులకు పంపించారు. దీంతో హేమకు మరోమారు నోటీసులు ఇవ్వడానికి పోలీసులు రెడీ అయ్యారు. హేమ విచారణకు హాజరు కాకపోవడాన్ని సీరియస్ గా పరిగణిస్తున్న పోలీసులు ఆమెకు మళ్లీ మరొక తేదీని కేటాయిస్తూ నోటీసులు ఇవ్వనున్నారు. ఇదిలా ఉంటే బెంగళూరు రేవ్ పార్టీలో నటి హేమ తాను అసలు పాల్గొనలేదని ఒక వీడియో రిలీజ్ చేసి మరీ బుకాయించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత తాను బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొనలేదని చెప్పేందుకు చికెన్ బిర్యాని ఎలా తయారు చేయాలో ఒక వీడియోని చేసి ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశారు. ఇక నటి హేమ జనాలను తప్పుదారి పట్టించే క్రమంలో వీడియోలు చేస్తోందని బెంగళూరు రేవ్ పార్టీలో ఆమె పాల్గొన్నారని పోలీసులు ధృవీకరించారు. అంతేకాదు బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొన్న 103 మందికి డ్రగ్స్ తీసుకున్నారా లేదా అన్నది నిర్ధారణ చేసేందుకు రక్త పరీక్షలు నిర్వహించిన పోలీసులు ఆ పరీక్షలలో 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారించారు. డ్రగ్స్ తీసుకున్న వారిలో హేమ కూడా ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు. నేడు ఎనిమిది మందిని విచారించనున్న క్రమంలో హేమ తాను రాలేనని లేఖ రాయగా ... మరి మిగతావారు అయినా హాజరయ్యారా అనేది తెలియాల్సి ఉంది. విచారణకు హాజరుకాని వారి విషయంలో బెంగళూరు సిసిబి పోలీసులు ఏం నిర్ణయం తీసుకోబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos