ఒడిశా - ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టులు దాచిపెట్టిన భారీ ఆయుధ సామగ్రిని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. మావోయిస్టుల కదలికలపై అందిన పక్కా సమాచారంతో కూంబింగ్ ఆపరేషన్ చేపట్టిన జవాన్లు, మీనాగట్ట అడవుల్లో భూమిలో పాతిపెట్టిన పేలుడు పదార్థాలను మరియు ఆయుధాలను వెలికితీశారు. సరిహద్దు జిల్లాల్లోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు భారీ విధ్వంసానికి ప్లాన్ చేస్తున్నట్లు ఇంటిలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం అందింది. దీనితో రంగంలోకి దిగిన ప్రత్యేక బలగాలు, స్థానిక పోలీసు దళాలు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ తనిఖీల్లో మావోయిస్టుల ఆయుధ తయారీ కేంద్రాన్ని, ఆ ప్రదేశంలో మావోయిస్టులు నిల్వ చేసిన భారీ ఆయుధ గిడ్డంగిని గుర్తించారు. ఆయుధ తయారీ కేంద్రాన్ని ధ్వంసం చేసి, అక్కడున్న ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం, స్వాధీనం చేసుకున్న వాటిలో భారీ ఎత్తున ఐఈడీ పేలుడు పదార్థాలు, వైర్లు, డిటోనేటర్లు, మందుగుండు సామగ్రి మరియు కొన్ని దేశవాళీ తుపాకులు ఉన్నాయి. వీటితో పాటు మావోయిస్టులకు సంబంధించిన యూనిఫామ్‌లు, కిట్ బ్యాగులు మరియు విప్లవ సాహిత్యాన్ని కూడా భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. భారీ స్థాయిలో పేలుడు పదార్థాలు లభించడంతో ఆ ప్రాంతంలో అదనపు బలగాలను రంగంలోకి దించారు. మావోయిస్టులు భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుని ఈ పేలుడు పదార్థాలను అమర్చాలని భావించి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతమంతా జల్లెడ పడుతున్నామని, అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos