భారత్ - పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం కీలక ఆదేశాలు ఇచ్చింది. యుద్ధ పరిస్ధితుల్లో వాడే అత్యవసర అధికారాలను వాడాలని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం సూచించింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు హోంశాఖ ఈ మేరకు అత్యవసర ఆదేశాలు జారీ చేసింది. 1968 నాటి పౌర రక్షణ నిబంధనల ప్రకారం అత్యవసర అధికారాలను ఉపయోగించాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది. ముఖ్యంగా దాడులు లేదా అంతరాయాల ముప్పు ఉన్న సందర్భాలలో ఈ ఆదేశంతో అధికారులు వేగంగా నిర్ణయాలు తీసుకోవడానికి, అత్యవసర కొనుగోళ్లు చేయడానికి వీలవుతుంది.

1968 నాటి పౌర రక్షణ నియమాలలోని సెక్షన్ 11ని అమలు చేయాలని కోరుతూ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ప్రధాన కార్యదర్శులు, లెఫ్టినెంట్ గవర్నర్లకు కేంద్ర హోంశాఖ ఇవాళ లేఖ రాసింది. ఈ అధికారాల వల్ల ప్రజలను, ఆస్తులను రక్షించడానికి అవసరమైన అత్యవసర చర్యలు తీసుకోవచ్చు. అలాగే ఏదైనా అత్యవసర పరిస్థితిలో విద్యుత్, నీరు, ఆసుపత్రులు, కమ్యూనికేషన్ వంటి ముఖ్యమైన సేవలు సజావుగా కొనసాగేలా ఏ చర్య అయినా తీసుకోవచ్చు. 

అలాగే కేంద్రం నుంచి అనుమతుల కోసం వేచి ఉండకుండా సాధారణ ప్రక్రియను పక్కనబెట్టి పౌర రక్షణకు అవసరమైన పరికరాలు లేదా సేవలను నేరుగా కొనుగోలు చేసేందుకు వీలు కల్పిస్తోంది. సైనిక దాడి అయినా, ఉగ్రవాద దాడి అయినా లేదా సాధారణ జీవితానికి అంతరాయం కలిగించే ఏ చర్య అయినా రాష్ట్రాలు వేగంగా చర్య తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలని కేంద్రం ఆదేశాలు ఇచ్చింది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos