చరిత్రలో తొలిసారిగా హైదరాబాద్ లో నిర్వహిస్తున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కోసం పార్టీ సీనియర్ నాయకులు నగరానికి చేరుకున్నారు.  పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నేతృత్వంలో సీడబ్ల్యూసీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. పార్టీ వర్కింగ్ కమిటీ సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు, సీనియర్ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా పూర్వ అద్యక్షులు మొత్తం 84 మంది ఈ సమావేశంలో పాల్గొన్నారు. అతిథులకు ప్రత్యేక ఆహ్వానం పలికేందుకు తాజ్ కృష్ణ హోటల్ వద్ద కాంగ్రెస్ పార్టీ గుస్సాడి, ఒగ్గుడోలు కళాకారుల ప్రదర్శనలను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా కళాకారులు తమ కళను ఉత్సాహంగా ప్రదర్శిస్తుండగా ములుగు ఎమ్మెల్యే సీతక్క వారితో కలిసి నృత్యం చేయడం ప్రత్యేకతను సంతరించుకుంది. ఆదివాసీల నృత్యం అయిన గుస్సాడి నృత్యం చేసి అక్కడున్నవారిలో ఎమ్మెల్యే సీతక్క జోష్ నింపి కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇదిలావుండగా...
రేపు సాయంత్రం అంటే 17వ తేదీ సాయంత్రం... తుక్కుగూడా లో జరిగే బహిరంగ సభలో తెలంగాణ ప్రజలకు వరంగా సోనియాగాంధీ 6 గ్యారంటీలను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. కాగా... కాంగ్రెసు పార్టీ ఈరోజు, రేపు నిర్వహిస్తున్న కార్యక్రమాలు, సమావేశాల సందర్భంగా అగ్రశ్రేణి నాయకులు నగరానికి వచ్చిన నేపథ్యంలో సంబంధిత ప్రాంతాలలో పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos