వాహనదారులకు స్వాతంత్య్ర దినోత్సవ కానుక ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఆగస్టు 15 నుంచి ఫాస్టాగ్ కొత్త పాసులు తీసుకొస్తోంది. ఈ మేరకు కేంద్ర ఉపరితల రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాసులు జారీ చేస్తామని తెలిపింది. దీని ద్వారా వాహనదారులు జాతీయ రహదారులపై ప్రయాణించినప్పుడు ఆర్థిక భారం తగ్గడంతో పాటు ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రయాణం కొనసాగించవచ్చని తెలిపింది. రూ.3 వేలు చెల్లించి పాస్ తీసుకోవచ్చని, దీని ద్వారా ఏడాదంతా 200 ట్రిప్పులు దేశంలో ఎక్కడైనా ప్రయాణించవచ్చని పేర్కొంది.

ఈ మేరకు కేంద్ర ఉపరితల రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. 'అవాంతరాలు లేని హైవే ప్రయాణం కోసం జరుగుతున్న మార్పుల్లో ఇది కీలకమైన అడుగు. రూ.3 వేల ధరతో ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్ పరిచయం చేస్తున్నాం. ఇది ఆగస్టు 15, 2025 నుంచి అమలులోకి వస్తుంది. ఈ పాస్ యాక్టివేషన్ తేదీ నుంచి ఒక సంవత్సరం లేదా 200 ట్రిప్పుల వరకు చెల్లుబాటు అవుతుంది. ఏది ముందుగా వస్తే అది. ఈ పాస్‌ కార్లు, జీపులు, వ్యాన్ల వంటి వాణిజ్యేతర ప్రైవేట్ వాహనాల కోసం ప్రత్యేకంగా రూపొందించామని  కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.

వార్షిక పాస్ దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై తక్కువ ఖర్చుతో ప్రయాణం సజావుగా సాగేందుకు అనుమతిస్తుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. యాక్టివేషన్, పునరుద్ధరణ కోసం ప్రత్యేక లింక్ త్వరలో రాజ్‌మార్గ్ యాత్ర యాప్‌, అలాగే NHAI, MoRTH అధికారిక వెబ్‌సైట్లలో అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. ఏడాది పాస్ తీసుకున్న తర్వాత యాక్టివేషన్, అప్డేషన్ వంటివి ఆన్‌లైన్ ద్వారా సులభంగా చేసుకోవచ్చన్నారు.

ఈ కొత్త విధానం 60 కి.మీ పరిధిలో ఉన్న టోల్ ప్లాజాల గురించి చాలాకాలంగా ఉన్న ఫిర్యాదులను పరిష్కరిస్తుందని అభిప్రాయపడ్డారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. ఒకేవిడతలో, సరసమైన లావాదేవీ ద్వారా టోల్ చెల్లింపులను సులభతరం చేస్తుందన్నారు. అదేవిధంగా టోల్ ప్లాజా వద్ద వేచి ఉండే సమయాన్ని గణనీయంగా తగ్గిస్తందని, దీంతో రద్దీ తగ్గుతుందని పేర్కొన్నారు. టోల్ ప్లాజాల వద్ద వివాదాలు కూడా తగ్గుతాయని అభిప్రాయపడ్డారు. దేశంలోని లక్షలాది మంది వాహనదారులు ఇక వేగవంతమైన, సులభమైన ప్రయాణ అనుభవాన్ని ఆస్వాదిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ వార్షిక పాస్ లక్ష్యం ఇదేనని తెలిపారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos