మార్చిలో లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడి... త్వరలోనే సార్వత్రిక ఎన్నికలు ఎదుర్కొనాల్సిఅరగనున్న క్రమంలో... ఇండియా కూటమికి బిగ్ షాక్ తగిలింది. ఈ అలయెన్స్‌లో కీలకంగా వ్యవహరిస్తున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్‌తో సీట్ల పంపకాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తృణమూల్ కాంగ్రెస్- కాంగ్రెస్ మధ్య సీట్ల పంపకాలపై కొద్దిరోజులుగా చర్చలు సాగుతున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 42 లోక్‌సభ స్థానాలు ఉండగా.. వాటి పంపకాలపై ఈ రెండు పార్టీల మధ్య వరుసగా సమావేశాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఉన్న 42 లోక్‌సభ స్థానాల్లో రెండింటిని మాత్రమే కాంగ్రెస్‌కు ఇస్తామని తృణమూల్ స్పష్టం చేసింది. కాంగ్రెస్ మాత్రం ఎనిమిది నుంచి 14 స్థానాలను డిమాండ్ చేస్తోంది. దీనిపై ఈ రెండు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరట్లేదు. చర్చలు కొలిక్కి రావడం లేదు. రెండు లోక్‌సభ స్థానాలను మాత్రమే తీసుకోవడానికి  కాంగ్రెస్ అంగీకరించట్లేదు. ఈ నేపథ్యంలో మమత బెనర్జీ కీలక నిర్ణయాన్ని తీసుకొని... వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని తేల్చి చెప్పారు. ఎలాంటి పొత్తులూ ఉండబోవని స్పష్టం చేశారు. సీట్ల పంపకాల విషయంలో తాము పెట్టిన ప్రతిపాదనలను కాంగ్రెస్ అంగీకరించట్లేదని, వారు పెట్టిన డిమాండ్లకు అంగీకరించడానికి తాముు సిద్ధంగా లేమని అన్నారు. దీంతో ఆదిలోనే హంసపాదు అన్నట్లు... ఇండియా కూటమికి ఇంకా ఎన్నికల దాకా వెళ్ళక ముందే పెద్ద షాక్ తగిలినట్లు అయింది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos