భారత్ సైన్యాలు చివరకు పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) లోకి అడుగుపెట్టినట్టు అనధికార సమాచారం వెలుగులోకి వచ్చింది. ఎప్పటినుంచో దేశ ప్రజలు కోరుకుంటున్న ఈ చర్య తుది దశకు చేరిందని భావిస్తున్నారు. భారత సైన్యం ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పీవోకేలో ఆపరేషన్ సిందూర్‌ను కొనసాగిస్తోందని సమాచారం. ఈ మేరకు ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడకపోయినా, భద్రతా వర్గాలు పీవోకేలో కార్యకలాపాలు జోరుగా జరుపుతున్నట్లు సంకేతాలు వస్తున్నాయి.

ఈ క్రమంలో భారత్ చేస్తున్న దాడులతో పాకిస్థాన్ వణికిపోతోంది. ప్రజల గుండెల్లో ధైర్యం నింపేందుకు ఆ దేశ మీడియా 'చైనా ఇచ్చిన పేలని బాంబులతో మేము ఎదురొడ్డి పోతున్నాం' అని అబద్ధ ప్రచారానికి పాల్పడుతోంది. కానీ మైదానంలో వాస్తవం వేరే. భారత్ చేపట్టిన ఈ వ్యూహాత్మక దాడులలో పాక్ రాజధాని ఇస్లామాబాద్ వరకూ ఉగ్ర స్థావరాలు దెబ్బతిన్నట్లు సమాచారం. భారత డ్రోన్లు పాక్ ప్రధాని కార్యాలయ సమీపాన బాంబులు వేసినట్టు చెబుతున్నారు, ఇది పాక్ సైన్యంలో తీవ్ర ఆందోళన కలిగించింది.

ఈ పరిణామాల మధ్య పాకిస్థాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ భద్రతా కారణాల చేత బంకర్లలో దాక్కొని ఉన్నట్టు సమాచారం. తాజాగా, ఆయన విదేశాలకు పారిపోవాలనే ప్రయత్నంలో ఉన్నారని పాక్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, ఇప్పటికే ఆ దేశ ఆర్మీ చీఫ్ కుటుంబంతో విదేశాలకు తరలిపోయినట్టు వార్తలొస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో పాకిస్థాన్ లో రాజకీయ మరియు సైనిక వ్యవస్థ తడబడుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో భారత సైన్యం సాహసోపేతమైన అడుగులతో దేశ భద్రతను కాపాడడమే కాకుండా శత్రుదేశాలకు గుణపాఠం నేర్పుతోందనే ప్రశంసలు వినిపిస్తున్నాయి.

Related Videos