ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టయిన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు, ఢిల్లీ మాజీ మంత్రి మనీష్ సిసోడియాకు భారీ ఊరట లభించింది. సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఈడీ, సీబీఐ రెండు కేసుల్లో రూ.10 లక్షల పూచీకత్తుపై బెయిల్ ఇచ్చింది. ఫిబ్రవరి 26, 2023న అరెస్టయిన మనీష్ సిసోడియా.. గత 17 నెలల నుంచి జైల్లోనే ఉన్నారు. పలుసార్లు ఆయన వేసిన బెయిల్ పిటిషన్లను కోర్టులు తిరస్కరించాయి. చివరకు సుదీర్ఘ న్యాయ పోరాటం అనంతరం సుప్రీంకోర్టు తాజాగా ఉపశమనం కలిగించింది. అయితే, మాజీ మంత్రి తన పాస్‌పోర్ట్ సరెండర్ చేయాలని కోర్టు ఆదేశించింది. విచారణలో జాప్యం కావడం వల్లే బెయిల్ మంజూరు చేస్తున్నట్టు స్పష్టం చేసిన న్యాయస్థానం.. సాక్షులను ప్రభావితం చేయరాదని పేర్కొంది.
మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌పై ఆగస్టు 6న విచారణ పూర్తిచేసిన జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌ల ధర్మాసనం.. తీర్పును రిజర్వులో పెట్టింది. శుక్రవారం ఉదయం తీర్పు వెలువరించిన ధర్మాసనం.. సిసోడియాను మళ్లీ ట్రయల్ కోర్టుకు పంపితే అది న్యాయాన్ని అపహాస్యం చేయడమే అవుతుందని వ్యాఖ్యానించారు. సిసోడియా గత 17 నెలలుగా కస్టడీలో ఉన్నారని, ఇంకా విచారణ ప్రారంభం కాలేదని, దీంతో ఆయన సత్వర విచారణ హక్కును కోల్పోతున్నారని కోర్టు పేర్కొంది.
సిసోడియాకు బెయిల్‌ను సీబీఐ, ఈడీలు వ్యతిరేకించాయి. జైలు నుంచి బయటకు వస్తే ఆయన సాక్షులను ప్రభావితం చేస్తారని వాదించాయి. కానీ, న్యాయస్థానం మాత్రం వారి వాదనలను తోసిపుచ్చింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో 2023 ఫిబ్రవరి 26న సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేయగా... మనీల్యాండరింగ్ ఆరోపణలతో అదే ఏడాది మార్చి 9న ఈడీ అదుపులోకి తీసుకుంది. అప్పటి నుంచి ఆయన తీహార్ జైల్లోనే ఉన్నారు. అయితే, విచారణ సమయంలో కేసు దర్యాప్తు ఎప్పటిలోగా పూర్తవుతుందని సీబీఐ, ఈడీలను న్యాయస్థానం ప్రశ్నించింది. ఈ కేసుల్లో 493 మంది సాక్షులను విచారించారని, ఇంకా ఎన్నాళ్లు పడుతుందని నిలదీస్తూ ... ఈ మేరకు తీర్పునిచ్చింది. కాగా సిసోడియాకు బెయిల్ రావడంతో ఆప్ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos