తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న 72వ మిస్‌ వరల్డ్‌ పోటీలు శనివారం సాయంత్రం అంటే ఇవాళ సాయంత్రం గచ్చిబౌలి స్టేడియంలో వైభవంగా ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ఓపెనింగ్‌ సెర్మనీకి సీఎం రేవంత్‌ రెడ్డి హాజరుకానున్నారు. 120 దేశాలకు చెందిన అందాల భామలు పోటీల్లో పాల్గొననుండగా, మన దేశం నుంచి నందిని గుప్తా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ‘తెలంగాణ జరూర్​ ఆనా’ ట్యాగ్​లైన్​తో ఈ పోటీలు జరగనున్నాయి. వెయ్యి మందికిపైగా గెస్టులు, టాలీవుడ్‌, బాలీవుడ్‌ సెలబ్రిటీలు హాజరుకానున్నారు. మిస్​వరల్డ్​ ఓపెనింగ్​ సెర్మనీ అట్టహాసంగా నిర్వహించేందుకు పర్యాటక శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

అటు భారత్‌ - పాకిస్తాన్‌ మధ్య యుద్ధం నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. కాగా నేటి నుంచి మొదలయ్యే​ మిస్​వరల్డ్ పోటీలు జూన్​ 2న ముగుస్తాయి. మొత్తం 23 రోజుల పాటు సాగే పోటీల్లో కీలకమైన గ్రాండ్​ ఫినాలె ఈ నెల 31న హైటెక్స్​లో జరగుతుంది. తెలంగాణలోని టూరిస్ట్‌ ప్లేస్‌లను, హెల్త్​టూరిజాన్ని ప్రమోట్​చేయడం ద్వారా ప్రపంచం దృష్టిని ఆకర్షించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పోటీల నిర్వహణకు ముందుకొచ్చింది. కాగా అందాల పోటీల్లో భాగంగా తొలిరోజు కంటెస్టెంట్స్​ పరిచయ కార్యక్రమం ఉంటుంది. ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ స్థాయి పోటీలకు హైదరాబాద్​ ఆతిథ్యం ఇవ్వడం ఇదే మొదటిసారి కావడం విశేషం.

మిల్ వరల్డ్ పోటీల నిర్వహణ ద్వారా  రాష్ట్ర ప్రతిష్టను పెంచడంతో పాటు పెట్టుబడుల ఆకర్షణకు అందాల పోటీలను వినియోగించుకోవాలని భావిస్తోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అందుకే వీటిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. పర్యాటక రంగం అభివృద్ధి చెందడంతో పెట్టుబడుల సాధన, ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని భావిస్తోంది. మరోవైపు వివిధ దేశాలకు చెందిన మిస్​ వరల్డ్​ కంటెస్టెంట్స్ మే16న  మహబూబ్ నగర్ జిల్లాలోని  పిల్లల మర్రిని సందర్శించనున్నారు. ఈ అధికారులతో  కలిసి జిల్లా కలెక్టర్   క్షేత్రస్థాయిలో  ఏర్పాట్లను పరిశీలించారు. 750 సంవత్సరాల చరిత్ర ఉన్న  పిల్లల మర్రి చెట్టు, పురావస్తు  మ్యూజియం, రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానాన్ని అందగత్తెలు సందర్శించనున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos