ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ చేసిన విమర్శలపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తీవ్రంగా స్పందించారు. మౌలిక సదుపాయాలు, మానవ వనరులు, ఆవిష్కరణల విషయంలో బెంగళూరుకు దేశంలో మరే నగరమూ సాటిరాదని ఆయన అన్నారు. విశాఖపట్నంలో గూగుల్ సంస్థ భారీ డేటా, ఏఐ హబ్ ఏర్పాటుకు ముందుకొచ్చిన నేపథ్యంలో లోకేశ్ ఇతర రాష్ట్రాల్లోని మౌలిక సదుపాయాలపై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. బెంగళూరు విధానసౌధలో విలేకరులతో మాట్లాడుతూ డీకే శివకుమార్ తనదైన శైలిలో బదులిచ్చారు. "నారా లోకేశ్ అయినా, మరెవరైనా చేసిన వ్యాఖ్యలకు నేను స్పందించను. కానీ ఒకటి చెబుతున్నా, బెంగళూరుతో పోటీపడే నగరం దేశంలో మరొకటి లేదు. కొందరు తమను తాము మార్కెట్ చేసుకోవడానికే బెంగళూరు గురించి మాట్లాడుతుంటారు" అని ఆయన చురక అంటించారు. దేశ ప్రగతికి బెంగళూరు ఎంతో దోహదపడుతోందని ఆయన గుర్తుచేశారు. "బెంగళూరులో 25 లక్షల మంది ఐటీ నిపుణులు, 2 లక్షల మంది విదేశీయులు పనిచేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వచ్చే పన్నుల ఆదాయంలో దాదాపు 40 శాతం ఇక్కడి నుంచే వస్తోంది. వారికి కేంద్రం కూడా సహాయం చేయనివ్వండి, వారు అభివృద్ధి చెందనీయండి. కానీ బెంగళూరుతో పోలిక అనవసరమని" శివకుమార్ స్పష్టం చేశారు. మరిన్ని విదేశీ పెట్టుబడులు రాష్ట్రానికి, నగరానికి వస్తున్నాయని, చాలా కంపెనీలు ఇప్పటివరకు అద్దె భవనాల్లో పనిచేస్తూ, ఇప్పుడు సొంత క్యాంపస్‌లు ఏర్పాటు చేసేందుకు ముందుకొస్తున్నాయని, ఇదే బెంగళూరు బలమని ఆయన వివరించారు.

"ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లేవారిని మనం వద్దనగలమా? వాళ్లు ఎక్కువ రాయితీలు ఇస్తే వెళ్తారేమో, వెళ్లనివ్వండి. వారు కూడా అన్ని చోట్లా అనుభవాలు చూడాలి కదా" అని డీకే అన్నారు. బెంగళూరును ఎవరూ విడిచిపెట్టి వెళ్లరని, ఇక్కడున్న సౌకర్యాలే పెట్టుబడులను ఆకర్షిస్తాయని, తాము ప్రత్యేకంగా రాయితీలు ప్రకటించి ఎవరినీ పిలవాల్సిన అవసరం లేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు, ఈ అంశంపై జేడీఎస్ పార్టీ కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 'సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా' అయిన బెంగళూరుకు గ్రహణం పట్టిందని ఆరోపించింది. గుంతలమయమైన రోడ్లు, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రూ. 1.3 లక్షల కోట్ల పెట్టుబడి రాష్ట్రం చేజారిపోయిందని దుయ్యబట్టింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా 30,000 ఉద్యోగాలు, ఏటా రూ. 10,000 కోట్ల ఆదాయం వచ్చేదని, కానీ ప్రభుత్వ అసమర్థత వల్లే పొరుగు రాష్ట్రానికి వెళ్లిపోయిందని జేడీఎస్ విమర్శించింది. మంత్రి డీకే శివకుమార్ అహంకారం కూడా పారిశ్రామికవేత్తలను భయపెడుతోందని ఆ పార్టీ ఆరోపించింది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos