ఇటీవలి విమానాల రద్దు, ఆలస్యం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణికులకు ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో భారీ ఊరట కల్పించింది. బాధితులకు చెల్లించాల్సిన నష్టపరిహారం మొత్తం రూ.500 కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదికగా ఒక ప్రకటన విడుదల  విమానం బయలుదేరడానికి 24 గంటల ముందు రద్దయిన సర్వీసుల ప్రయాణికులకు, కొన్ని విమానాశ్రయాల్లో తీవ్రంగా చిక్కుకుపోయిన వారికి ఈ పరిహారం అందించనున్నట్టు కంపెనీ తెలిపింది. "నష్టపరిహారం అందించే ప్రక్రియను వీలైనంత పారదర్శకంగా, సులభంగా పూర్తి చేయడమే మా లక్ష్యం. మా ప్రస్తుత అంచనా ప్రకారం ఈ మొత్తం రూ.500 కోట్లు దాటుతుందని" ఇండిగో పేర్కొంది. ఈ నెల‌ 3, 4, 5 తేదీల్లో తీవ్రంగా ప్రభావితమైన విమానాలను, విమానాశ్రయాల్లో చిక్కుకుపోయిన ప్రయాణికులను గుర్తించే పనిలో ఉన్నామని, జనవరిలో వారందరినీ సంప్రదించి సజావుగా పరిహారం అందిస్తామని వివరించింది. ఇప్పటికే చాలామందికి రిఫండ్‌లు పూర్తి చేశామని, మిగిలినవి కూడా త్వరలోనే వారి ఖాతాల్లో జమ అవుతాయని స్పష్టం చేసింది.

మరోవైపు గత నాలుగు రోజులుగా కార్యకలాపాలు సాధారణ స్థితికి వస్తున్నాయని, ఈరోజు దేశవ్యాప్తంగా 2,000లకు పైగా విమానాలను నడపనున్నట్టు ఇండిగో తెలిపింది. కార్యకలాపాల్లో అంతరాయానికి గల మూల కారణాలను విశ్లేషించడానికి ప్రముఖ విమానయాన నిపుణుడు కెప్టెన్ జాన్ ఇల్సన్ నేతృత్వంలోని 'చీఫ్ ఏవియేషన్ అడ్వైజర్స్ ఎల్ఎల్‌సీ'ని నియమించింది. ఈ పరిణామాల నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్‌ను పిలిచి విచారించింది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos