జాతి హింసతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు సిద్ధమవుతున్న తరుణంలో రాష్ట్ర భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. పార్టీ అధిష్ఠానం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ 43 మంది నాయకులు, కార్యకర్తలు మూకుమ్మడిగా తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ ఘటన ఉఖ్రుల్ జిల్లాలోని ఫుంగ్యార్ నియోజకవర్గంలో జరిగింది. పార్టీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై తీవ్ర ఆందోళన చెందుతున్నామని రాజీనామా చేసిన నేతలు ఒక ప్రకటనలో తెలిపారు. అంతర్గత సంప్రదింపులు, కలుపుగోలుతనం లోపించాయని, క్షేత్రస్థాయి నాయకత్వాన్ని ఏమాత్రం గౌరవించడం లేదని వారు ఆరోపించారు. పార్టీ సిద్ధాంతాలకు తాము కట్టుబడి ఉన్నామని, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కొనసాగలేమని స్పష్టం చేశారు. ఈ మూకుమ్మడి రాజీనామాలపై మణిపూర్ బీజేపీ రాష్ట్ర విభాగం తీవ్రంగా స్పందించింది. ఇదంతా కేవలం పబ్లిసిటీ కోసం చేస్తున్న స్టంట్ అని, పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నమని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆవుంగ్ షిమ్రే హోపింగ్‌సన్ కొట్టిపారేశారు. "రాజీనామా చేసిన వ్యక్తులు 2022 అసెంబ్లీ ఎన్నికల నుంచే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం, పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించేందుకే ఈ చర్యకు పాల్పడ్డారని" ఆయన ఒక ప్రకటనలో విమర్శించారు. 2023 మే నెలలో మైతీ, కుకీ వర్గాల మధ్య జాతి హింస చెలరేగిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ మణిపూర్‌కు రావడం ఇదే తొలిసారి. సెప్టెంబర్ 13న అంటే రేపు ఆయన పర్యటన ఖరారైన నేపథ్యంలో ఈ రాజకీయ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. హింస కారణంగా రాష్ట్రంలో ఇప్పటివరకు 260 మందికి పైగా మరణించగా, వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ప్రస్తుతం మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన అమల్లో ఉండగా, అసెంబ్లీని సుప్తచేతనావస్థలో ఉంచారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos