న్యూస్ : ప్రముఖ మార్క్సిస్టు నేత, సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి మరణం భారత కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆయన మృతి పట్ల సిపిఐ రాష్ట్ర సమితి ప్రగఢ సంతాపాన్ని తెలియజేస్తున్నట్లు కూనంనేని తెలిపారు. ఆయన మృతి కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటన్నారు. ఆయన ఉన్నతమైన విద్యావంతుడు, గొప్ప మేధావి అని ఆయన గుర్తుచేశారు. ఢల్లీిలోని జెఎన్యులో చదువుకున్నారని, ఆనాటి నుంచి పూర్తికాలం ఢల్లీిలో ఉన్నారని అన్నారు. సిపిఐ(ఎం) పార్టీ, కమ్యూనిస్టుపార్టీల ఉద్యమానికి గొప్ప సేవలందించారని తెలిపారు. ఆయన చనిపోవడం వలన సిపిఎంకే కాదు కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని నష్టమని అన్నారు. ప్రజాసమస్యలు, దేశ సమస్యలను ప్రస్తావన చేసే ఒక గొంతు మూగబోయిందని అన్నారు. ఆయన పార్లమెంట్లో సైతం గొప్పగా రాణించారని, సిపిఐతో సత్సంబంధాలు కొనసాగించారని కూనంనేని తెలిపారు. ఆయన మృతి పట్ల సంతాపాన్ని, వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos