నదిని దాటడం కోసం నిర్మించిన బ్రిడ్జి కూలిపోయింది. ఆ సమయంలో దాని మీద ప్రయాణం చేస్తున్న వాహనాలు ఒక్కసారిగా నదిలోకి పడిపోయాయి. ఈ ప్రమాదంలో నాలుగు వాహనాలు నీటిలో పడిపోగా.. ముగ్గురు మ‌ృతి చెందారు. మరి కొందరు గల్లంతయ్యారు. ఈ విషాదకర సంఘటన గుజరాత్‌లో చోటు చేసుకుంది. ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ షాకింగ్ ప్రమాదం గుజరాత్‌లో వెలుగు చూసింది. గుజరాత్ లోని మహిసాగర్ నదిపై ఉన్న గంభీర వంతెన  కొంత భాగం బుధవారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో ఉన్నట్లుండి ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది. కళ్లు మూసి తెరిచేలోపు ఈ ప్రమాదం జరిగింది. బ్రిడ్జి కూలిన సమయంలో దాని మీద పదుల సంఖ్యలో వాహనాలు ప్రయాణం చేస్తున్నాయి. వంతెన కూలడంతో అవి నదిలోకి పడిపోయాయి. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 

గుజరాత్‌లోని ఆనంద్ పట్టణం - వడోదరలను కలుపుతూ.. పద్రా వద్ద మహిసాగర్ నదిపై గంభీర వంతెన నిర్మించారు. బుధవారం ఒక్కసారిగా దీనిలో కొంత భాగం కుప్పకూలడంతో.. అదే సమయంలో దాని మీద నుంచి వెళ్తున్న రెండు ట్రక్కులు, రెండు వ్యాన్లతో పాటుగా మరి కొన్ని వెహికల్స్ నదిలోకి పడిపోయాయి. ఈఘటనలో ముగ్గురు మృతి చెందారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే సహాయక బృందాలు అక్కడికి చేరుకుని నదిలో ఉన్న వారిని రక్షించే పని ప్రారంభించాయి. నదిలో పడిపోయిన వాహనాల నుంచి ఇప్పటివరకు నలుగురిని రక్షించారని.. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.

ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని సంబంధిత అధికారులు తెలిపారు. గంభీర వంతెన కూలిపోవడంతో.. ఆనంద్ పట్టణం - వడోదరల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ముగ్గురు మృతి చెందగా.. మరి కొందరి ఆచూకీ లభించడం లేదు. ఇక, ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో.. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos