తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే. సుమారు రెండు వారాలుగా శ్రీతేజ్‌కు సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స జరుగుతున్నా.. ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదు.

ఈ క్రమంలోనే తాజాగా  సినిమా ప్రొడ్యూసర్, అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ సికింద్రాబాద్‌ లోని కిమ్స్‌ ఆస్పత్రికి వెళ్లి.. చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ను పరామర్శించారు. ప్రస్తుతం శ్రీతేజ్‌ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే తదితర విషయాలను కిమ్స్ హాస్పిటల్ డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. కాగా శ్రీతేజ్‌ ఆరోగ్యం గురించి కిమ్స్ హాస్పిటల్ డాక్టర్లు మంగళవారం రాత్రి హెల్త్ బులిటెన్ విడుదల చేస్తూ... ప్రస్తుతం శ్రీతేజ్ ఆరోగ్యం విషమంగానే ఉందని.. ఐసీయూలో వెంటిలేటర్‌పైనే ఉన్నాడని ఆ హెల్త్‌ బులిటెన్‌లో పేర్కొన్నారు. శ్రీతేజ్ మెదడుకు ఆక్సిజన్‌ సరిగా అందడం లేదని.. అతడ్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని వారు పేర్కొన్నారు. ప్రస్తుతం ట్యూబ్‌ ద్వారా శ్రీతేజ్‌కు ఆహారం అందిస్తున్నామని వెల్లడించారు. 

కాగా తాను రేవతి కుటుంబానికి అండగా నిలుస్తామని..  కేసు కారణంగా అల్లు అర్జున్ ఆస్పత్రికి రాలేదని.. అల్లు అర్జున్ తరపు తాను వచ్చినట్లు అల్లు అరవింద్ వెల్లడించారు. ఎటువంటి సహాయం అవసరమైనా తమకి సాధ్యమైనంతవరకూ చెయ్యడానికి సిద్దంగా ఉన్నామని ప్రకటించారు. కేసు విచారణలో ఉన్నందున ఆ బాలుడ్ని, బాధిత కుటుంబాన్ని కలవకూడదన్న సలహా మేరకు అల్లు అర్జున్ రాలేదని అల్లు అరవింద్ వివరించారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos