మరో రెండు రోజుల్లో 2025 సంవత్సరం ముగిసి, 2026 కొత్త సంవత్సరం ప్రారంభం కాబోతోంది. జనవరి 1 నుంచి సామాన్యుడి జేబుపై, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలపై, రైతుల సంక్షేమ పథకాలపై ప్రభావం చూపే అనేక కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. బ్యాంకింగ్, పన్ను విధానాలు, గ్యాస్ ధరలు వంటి అంశాల్లో వస్తున్న ఈ మార్పులను ప్రజలు గమనించాల్సి ఉంది. ప్రధానంగా పాన్-ఆధార్ అనుసంధానం అత్యంత కీలకం కానుంది. ఇప్పటికీ వీటిని లింక్ చేయని వారి బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ అయ్యే ప్రమాదం ఉంది. బ్యాంకింగ్ సేవలు, పన్ను రిఫండ్లు నిలిచిపోకుండా ఉండాలంటే తక్షణం ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సిందే. ఇక, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్తగా, 2025 డిసెంబర్ 31తో 7వ వేతన సంఘం గడువు ముగియనుండటంతో జనవరి 1 నుంచి 8వ వేతన సంఘం సిఫార్సులు అమల్లోకి రానున్నాయి. దీనివల్ల ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. బ్యాంకింగ్ రంగంలో మరో ప్రధాన మార్పు క్రెడిట్ స్కోర్ అప్డేట్. ఇప్పటివరకు 15 రోజులకోసారి జరిగే ఈ ప్రక్రియ, ఇకపై ప్రతి వారం జరగనుంది. దీనివల్ల లోన్ రీపేమెంట్లలో ఏ చిన్న జాప్యం జరిగినా వెంటనే క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం పడుతుంది. పీఎం కిసాన్ పథకంలో కొత్తగా చేరే రైతులకు 'ఫార్మర్ ఐడీ' తప్పనిసరి చేశారు. జనవరి 1 నుంచి కొత్త దరఖాస్తుదారులు ఈ డిజిటల్ ఐడీ ద్వారానే రూ.6,000 సాయం పొందేందుకు అర్హత సాధిస్తారు. వీటితో పాటు 2026 జనవరి నుంచి వచ్చే కొత్త ఐటీఆర్ ఫారాల్లో బ్యాంకింగ్, ఖర్చుల వివరాలు ప్రీ-ఫిల్ అయి రానున్నాయి. అలాగే, ప్రతి నెల మొదటి తేదీన జరిగే ఎల్‌పీజీ, విమాన ఇంధన ధరల సవరణ కూడా జరగనుంది. డిజిటల్ మోసాలను అరికట్టేందుకు యూపీఐ లావాదేవీలు, సిమ్ వెరిఫికేషన్ నిబంధనలను మరింత కఠినతరం చేయనున్నారు. ఆర్బీఐ కొత్త నిబంధనల ప్రకారం కో-లెండింగ్ (Co-lending) విధానంలోనూ మార్పులు రానున్నాయి.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos