కొత్త ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చే వారికి ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఉపశమనాన్ని ప్రకటించారు. రూ. 12 లక్షల వరకు (నెలకు సుమారు రూ. 1 లక్ష) ఆదాయం ఉన్న వ్యక్తులకు ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఇచ్చారు. జీతం పొందే పన్ను చెల్లింపుదారులకు, రూ. 75,000 స్టాండర్డ్ డిడక్షన్ కారణంగా ఈ పరిమితిని రూ. 12.75 లక్షలకు పెంచారు. మధ్యతరగతిపై పన్ను భారాన్ని గణనీయంగా తగ్గించడం వల్ల చేతుల్లో ఎక్కువ డబ్బు ఉంటుందని ఆర్థిక మంత్రి సీతారామన్  అన్నారు. గృహ వినియోగం, పొదుపు, పెట్టుబడిపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందన్నారు.

వేతన జీవులపై పన్ను స్లాబ్ విధానం ఎలా ఉన్నది. 
- 0-4 లక్షల వరకు పన్ను లేదు
- 4-8 లక్షల వరకు 5 శాతం పన్ను
- 8-12 లక్షల వరకు 10 శాతం పన్ను
- 12-16 లక్షల వరకు 15 శాతం పన్ను
- 16-20 లక్షల వరకు 20 శాతం పన్ను
- 20-24 లక్షల 25% పన్ను
- రూ. 24 లక్షలకు పైబడి 30 శాతం పన్ను 

సాధారణ ఆదాయంలో ఏడాదికి రూ.12 లక్షల వరకు సంపాదించే వ్యక్తులు పన్ను నుంచి మినహాయింపు పొందుతారు. ఫలితంగా ఈ ఆదాయంలో ఉన్న పన్ను చెల్లింపుదారులు ఎటువంటి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు, రూ. 12 లక్షల ఆదాయం ఉన్న వ్యక్తికి రూ. 80,000 పన్ను ప్రయోజనం లభిస్తుంది, ఇది ప్రస్తుత పన్ను నిర్మాణం ప్రకారం చెల్లించాల్సిన పన్నులో 100% తగ్గింపు ఉంటుంది. అదేవిధంగా రూ. 18 లక్షలు సంపాదించే వ్యక్తికి రూ. 70,000 తగ్గింపు లభిస్తుంది. అయితే రూ. 25 లక్షల ఆదాయం ఉన్న పన్ను చెల్లింపుదారుకు రూ. 1,10,000 పన్ను ప్రయోజనం లభిస్తుంది.

పన్ను చెల్లింపుదారులకు స్పష్టమైన ప్రయోజనాలు ఉన్నప్పటికీ, కొత్త ప్రతిపాదనలు ప్రభుత్వానికి నష్టం కలిగిస్తాయి. మార్పుల ఫలితంగా ప్రత్యక్ష పన్నులలో (ఆదాయ పన్ను) రూ. 1 లక్ష కోట్ల నష్టం వాటిల్లుతుందని భావిస్తున్నారు. అదనంగా, జీఎస్టీ, కస్టమ్స్ సుంకాలు సహా పరోక్ష పన్నులు దాదాపు రూ. 2,600 కోట్ల నష్టం వాటిల్లుతుంది. పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కల్పించే లక్ష్యంతో ఈ కొత్త పన్ను ప్రతిపాదనలను అమలు చేయడానికి ప్రభుత్వం ఈ మొత్తాన్ని ఆదాయాన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉందని ఆర్థిక నిపుణులు అంటున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos