భారత సమాజాన్ని నిరంతరం నడిపిస్తున్న మహాశక్తి డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ అని.. ఆయన భావాలకు మరణం లేదని ఇప్పుడు ప్రతి నోటా వినిపిస్తున్న మాట. ఏప్రిల్‌ 14వ తేదీన అంటే ఇవాళ డా. భీమ్‌రావు అంబేద్కర్‌ 135వ జయంతి వేడుకలు నిర్వహించడానికి ఊరూ వాడా సిద్ధమవుతున్నాయి. ఈ సందర్భంగా అంబేద్కర్ జీవితం, చదువు, ఆయన ప్రధానంగా ఏ అంశాలపై పోరాడారనే అంశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బాబాసాహెబ్ అంబేద్కర్ మధ్యప్రదేశ్‌ లోని మోవ్‌లో 1891 ఏప్రిల్ 14వ తేదీన చివరి సంతానం అంటే 14వ సంతానంగా జన్మించారు. తండ్రి సుబేదార్ రామ్‌జీ మాలోజీ సక్పాల్, అతను బ్రిటిష్ సైన్యంలో పనిచేశారు. బీఆర్ అంబేద్కర్ తండ్రి సెయింట్ కబీర్ అనుచరుడు. అతని తండ్రి పదవీ విరమణ చేసినప్పుడు అంబేద్కర్‌కు దాదాపు రెండు సంవత్సరాలు మాత్రమే. అంబేద్కర్ కు ఆరేళ్ల వయసులో తల్లి చనిపోయింది. అనంతరం అతని అత్త ఆయనను పెంచి పెద్ద చేసింది.

బీఆర్‌ అంబేద్కర్ సతారాలో పాఠశాల విద్యను పూర్తి చేశారు. బాబాసాహెబ్ ప్రాథమిక విద్యాభ్యాసం బొంబాయిలో పూర్తయింది. మెట్రిక్యులేషన్ తర్వాత చిన్న వయసులోనే 1906లో వివాహం చేసుకున్నారు. దాదాపు 15 సంవత్సరాల వయసులో తొమ్మిదేళ్ల బాలిక అయిన రమాబాయిని వివాహం చేసుకున్నారు. ఆ సమయంలో అమలులో ఉన్న ఆచారం ప్రకారం తల్లిదండ్రులు ఈ వివాహాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఎల్ఫిన్‌స్టోన్ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక బరోడా ఇన్‌స్టిట్యూట్‌లో చేరారు. తదుపరి చదువుల కోసం లండన్ వెళ్లారు. న్యాయశాస్త్రాన్ని అభ్యసించడానికి గ్రేస్ ఇన్‌లో చేరారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్‌లో డిగ్రీని పూర్తి చేశారు. జర్మనీలోని బాన్ యూనివర్సిటీలో కొంతకాలం చదువుకున్నారు.

1924లో ఇంగ్లండ్ నుంచి తిరిగి వచ్చిన తరువాత అణగారిన వర్గాల సంక్షేమం కోసం ఒక సంఘాన్ని ప్రారంభించారు. దీనికి డాక్టర్ అంబేద్కర్ చైర్మన్‌గా ఉన్నారు. విద్యను వ్యాప్తి చేయడం, ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడం, అణగారిన వర్గాల వివక్షను దూరం చేయడం ఈ సంఘం ప్రధాన లక్ష్యాలుగా ఉండేవి. ఈ నేపథ్యంలోనే అణగారిన వర్గాల సమస్యలను పరిష్కరించడానికి బహిష్కృత్ భారత్ వార్తాపత్రిక 1927 ఏప్రిల్ 3న ప్రారంభించారు.

1928లో బొంబాయిలోని ప్రభుత్వ న్యాయ కాలేజీలో ప్రొఫెసర్‌గా చేరి.. 1935న జూన్ 1వ తేదీన అదే కాలేజీకి ప్రిన్సిపల్‌గా పనిచేసి 1938లో రాజీనామా చేసే వరకు అదే పదవిలో కొనసాగారు. 1936లో ఇండిపెండెంట్ లేబర్ రాజకీయ పార్టీని స్థాపించారు. ‘ది యానిహిలేషన్ ఆఫ్ కాస్ట్’ అనే పుస్తకంలో అంబేద్కర్ హిందూ మత పెద్దలను, కుల వ్యవస్థను తీవ్రంగా విమర్శించారు. వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌లో కార్మిక శాఖ మంత్రిగా కూడా ఆయన పనిచేశారు. స్వాతంత్ర్యం అనంతరం 1947లో దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ తొలి మంత్రివర్గంలో న్యాయ శాఖ మంత్రిగా నియమితులయ్యారు. స్వాతంత్ర్యం అనంతరం అంబేద్కర్‌ కాంగ్రెస్ నేతృత్వంలో మొదటి న్యాయ మంత్రిగా పనిచేశారు. రెండు వారాల తరువాత ఆయన భవిష్యత్ భారత గణతంత్ర రాజ్యానికి రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్‌గా నియమితులయ్యారు. ఆ క్రమంలో ఆయన రాజ్యాంగ సభ ముసాయిదా కమిటీకి చైర్మన్‌గా నియమితులయ్యారు. డాక్టర్ అంబేద్కర్ ప్రధానంగా సమానత్వం, సామాజిక న్యాయం, అంటరానితనం వంటి దళితుల హక్కుల కోసం పోరాడారు.

కానీ 1951లో కశ్మీర్ సమస్య, భారత విదేశాంగ విధానం, హిందూ కోడ్ బిల్లుకు సంబంధించి ప్రధాని నెహ్రూ విధానంతో విభేదాలు వ్యక్తం చేస్తూ మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన అక్టోబర్ 14, 1956న నాగపూర్‌లో జరిగిన ఒక చారిత్రాత్మక కార్యక్రమంలో బౌద్ధమతం స్వీకరించారు. 1948 నుంచి మధుమేహంతో బాధపడుతున్న బాబా సాహెబ్ అంబేద్కర్ 1956 డిసెంబర్ 6వ తేదీన ఢిల్లీలో నిద్రలోనే మరణించారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos