హైదరాబాద్ ; సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటారు మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన. తాజాగా కోల్ కత్తా  వైద్యవిద్యార్థిపై జరిగిన అత్యాచార ఘటనపై తీవ్రంగా స్పందించారు. ఈ ఘటన చూస్తుంటే సమాజంలో మానవత్వం ఎక్కడుందని, అనాగరిక సమాజంలో మనం బతుకున్నామా అని ప్రశ్నించింది. ఇలాంటి ఘటనలు జరుగుతుంటే ఏమని స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటామని నిలదీసింది. మహిళల భద్రత, గౌరవం కాపాడేందుకు దేశంలో మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపింది. మాన‌వ‌త్వాన్నే అప‌హాస్యం చేసే ఘ‌ట‌న ఇది అని పేర్కొన్నారు. స‌మాజంలో అనాగ‌రిక‌త కొన‌సాగుతుంటే మ‌నం ఎలాంటి స్వాతంత్ర్యాన్ని జరుపుకుంటున్నామ‌ని ఆమె ప్ర‌శ్నించారు.  

దేశ ఆరోగ్య సంర‌క్ష‌ణ‌కు మ‌హిళ‌లే వెన్నెముక అని తెలిపిన ఉపాస‌న‌.. ఈ రంగంలోని వ‌ర్క్‌ఫోర్స్ లో 50 శాతానికి పైగా మ‌హిళ‌లే ఉన్నార‌ని చెప్పారు. అంతేగాక ప‌లు అధ్యయ‌నాలు మ‌హిళా హెల్త్ వ‌ర్క‌ర్లే రోగుల‌తో ఎక్కువ స‌మ‌యం గ‌డుపుతున్న‌ట్లు తేల్చాయ‌ని గుర్తు చేశారు. మ‌హిళ‌లు మ‌న హెల్త్ రంగానికి చాలా అవ‌స‌రమ‌ని పేర్కొన్నారు.

Related Videos