ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. చంద్రబాబు అరెస్ట్ తో టీడీపీ, జనసేన పొత్తు అధికారికమైంది. చంద్రబాబును కుట్ర పూరితంగా జైలులో పెట్టారని టీడీపీ నేతలు వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. తాను చంద్రబాబుకు అండగా ఉంటానని జనసేన అధినేత పవన్ ప్రకటించి... బీజేపీ తమతో కలిసి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాజకీయం ఇంత హాట్ హాట్ గా నడుస్తున్న సమయంలో వైసీపీ ముఖ్య నేత విజయ సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు మరింత వేడిని పెంచాయి. ఇండియా కూటమిలో టీడీపీ చేరుతుందని ... ఇప్పటివరకు చంద్రబాబుకు మద్దతిస్తూ నారా లోకేశ్ కు ఫోన్ కాల్స్ చేస్తోంది కేవలం కూటమిలో ఉన్న పార్టీలకు చెందినవారేనని... దీన్నిబట్టి ఇండియా కూటమిలో టీడీపీ కూడా ఉందని నిరూపితమవుతోందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. చంద్రబాబు కు మద్దతుగా ఇండియా కూటమి నేతలు మమతా బెనర్జీ, ఫరూక్ అబ్దుల్లా, అఖిలేష్ యాదవ్ స్పందించారు కానీ... ఎన్డీఏ నుంచి ఎలాంటి స్పందన లేదని... ఇక ఇండియా కూటమితోనే టీడీపీ కొనసాగుతుందంటూ విజయ సాయిరెడ్డి చేసిన ట్వీట్ లో పేర్కొన్నారు. వీళ్లందరి ఉమ్మడి ప్రణాళిక ఒక్కటేనని, అధికారం కోసం చేతులు కలపడం, అందినకాడికి రాష్ట్రాన్ని దోచేయడమేనని విజయసాయి విమర్శించారు. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే దమ్ము టీడీపీకి లేదని పేర్కొన్నారు. ఈ క్రమంలో స్కిల్ అవినీతి వ్యవహారంతో చంద్రబాబుకు సంబంధమే లేదంటూ ప్రస్తుతం లోకేశ్ ఢిల్లీ కేంద్రంగా వాదన వినిపిస్తున్నారు. ఇదిలావుండగా... 2014 తరహాలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయాలనేది చంద్రబాబు, పవన్ ఆలోచన. కానీ, ఇప్పటి వరకు బీజేపీ నాయకత్వం నుంచి పొత్తు పైన స్పష్టత రాలేదు. ఈ సమయంలో ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న పవన్ కల్యాణ్ తనంతట తాను టీడీపీతో పొత్తు ప్రకటించారు. ఇప్పుడు బీజేపీ నిర్ణయం ఏంటనేది ఆసక్తిగా మారుతోంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos