హైదరాబాద్లో సాగర్ రోడ్డులోని నిర్మాణంలో పనుల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. నిర్మాణ పనులు చేస్తుండగా.. ఫ్లైఓవర్ ర్యాంపు కూలిపోయి 9 మంది కార్మికులు గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో 15 మంది కార్మికులు అక్కడ పని చేస్తున్నారు. గాయపడిన కూలీలు అంతా బీహార్ కు చెందినవారిగా తెలుస్తోంది. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. బుధవారం తెల్లవారుజామున ఫ్లైఓవర్లోని రెండు పిల్లర్ల మధ్య కార్మికులు శ్లాబ్ను వేస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది.
ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు ఏసీపీ శ్రీధర్ రెడ్డి తెలిపారు. తెల్లవారుజామున 3.10 గంటలకు ప్రమాదం జరిగిందని ... ఫ్లై ఓవర్ నిర్మాణంలో ఓ ర్యాంపు మాత్రమే కూలిందని చెప్పారు. ఇదిలా ఉంటే.. ఈ ఘటనపై ఆందోళన చేపట్టిన కాంగ్రెస్ శ్రేణులు.. సాగర్ రింగ్ రోడ్డు వద్ద నిరసనకు దిగారు. నాసిరకం పనుల వల్లే ఫ్లైఓవర్ శ్లాబ్ కూలిందని విమర్శిస్తూ... ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఘటనా స్థలిని స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, జీహెచ్ఎంసీ అధికారులు పరిశీలించారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై ఇంజినీర్ల బృందం విచారణ చేస్తోంది. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తిస్థాయి విచారణ జరిపితే మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయని అంటున్నారు.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos