సుప్రీం కోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబు పిటిషన్‌పై విచారణ విషయంలో ఎట్టకేలకు క్లారిటీ వచ్చేసింది. సుప్రీంకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ బుధవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఈ పిటిషన్‌పై రేపు విచారణ చేపట్టేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అంగీకరించారని తెలుస్తోంది. చంద్రబాబు తరఫు లాయర్లు దాఖలు చేసిన మెన్షన్ మెమోపై సీజేఐ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని సమాచారం. అయితే చంద్రబాబు పిటిషన్‌ ఏ బెంచ్ ముందు విచారణకు వస్తుందో వెల్లడి కావాల్సి ఉంది. సీజేఐ నేతృత్వంలో క్యూరేటివ్  పిటిషన్‌పై స్పెషల్ బెంచ్ సమావేశమైంది కానీ... తొలుత ఏ మెన్షన్ లను సీజేఐ అనుమతించలేదు. అయితే చంద్రబాబు లాయర్లు రిక్వెస్ట్ చేసిన క్రమంలో సీజేఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ నెల 28 నుంచి అక్టోబర్ 2 వరకు సుప్రీంకోర్టుకు సెలవులు ఉండటంతో.. చంద్రబాబు పిటిషన్‌పై రేపు విచారణ ఎలా ఉండబోతుందనేది ఉత్కంఠగా మారింది. రేపు చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఏదైనా నిర్ణయం తీసుకుంటుందా... లేక వచ్చే వారానికి వాయిదా వేస్తుందా అనే చర్చ కూడా జరుగుతోంది. మరోవైపు... విజయవాడ ఏసీబీ కోర్టులోనూ ఈ రోజు విచారణ జరిగే పరిస్ధితి లేదు. ఏసీబీ ప్రత్యేక కోర్టు జడ్జి జస్టిస్ హిమబిందు ఇవాళ ఒక్కరోజు సెలవు పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఇవాళ చంద్రబాబు కస్టడీ కోరుతూ సీఐడీ, బెయిల్ కోరుతూ ఆయన లాయర్లు దాఖలు చేసుకున్న పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా పడనుంది. అలాగే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులోనూ, ఏపీ ఫైబర్ నెట్ అక్రమాల కేసుల్లోనూ సీఐడీ చంద్రబాబు పీటీ వారెంట్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్లపైనా విచారణ వాయిదా పడినట్లుగానే భావించాల్సి ఉంటుంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos