తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలు రచిస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ...115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు భారీ హామీలు ఇచ్చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా బహిరంగ సభలు నిర్వహించడంతో పాటు... ఆయా పార్టీల అభ్యర్థుల ఎంపికకు కసరత్తు తీవ్రం చేస్తున్నాయి. ఈ క్రమంలో... ఎన్నికల నిర్వహణపై ఈసీ కూడా స్పీడ్ పెంచింది. ఎన్నికలకు రెండు నెలలు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో వడివడిగా అడుగులు వేస్తోంది. ఓటర్ల జాబితా తయారీ, బూత్ ల ఏర్పాట్లపై అధికారులతో వరుస సమీక్షలు నిర్వహిస్తోంది. ఎన్నికల ఏర్పాట్లపై జిల్లాల కలెక్టర్లపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తరచూ సమీక్షలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ క్రమంలో... ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రచారకర్తగా తొలిసారి ట్రాన్స్జెండర్ లైలాను ఎంపిక చేసింది. సాధారణంగా ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు, ఓటుహక్కుపై అవగాహన వంటి తదితర అంశాలపై ప్రచారం కోసం ఎన్నికల కమిషన్ సెలబ్రిటీలను ఎంపిక చేయడం ఆనవాయితీ. అయితే, తొలిసారి ఓ ట్రాన్స్జెండర్ను ఎంపిక చేసింది. వరంగల్లోని కరీమాబాద్కు చెందిన ట్రాన్స్జెండర్ను ఎంపిక చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆమెతో అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 3,600 మందికిపైగా ఉన్న ట్రాన్స్జెండర్లకు లైలా నాయకత్వం వహిస్తున్నారు. వారి సంక్షేమం కోసం జిల్లా అధికారులతో మాట్లాడి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో వారంలో ఒకరోజు వారికి ప్రత్యేక క్లినిక్ను లైలా చే ఏర్పాటు చేయించారు. గతంలో ఎప్పడూ లేనివిధంగా ఈసీ కీలక నిర్ణయం తీసుకోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos