ప్రపంచవ్యాప్తంగా... ఇటీవల రిలీజ్ అయిన ఆదిపురుష్ సినిమాకు ఎన్నో కాంప్లిమెంట్లు వచ్చినా... అంతకుమించిన కామెంట్స్ కూడా వచ్చాయి. ఇప్పటికీ వస్తున్నాయి. అదేవిధమైన కామెంట్స్... గాసిప్స్ తాజాగా మరో టాలీవుడ్ చిత్రానికి కూడా లెక్కలేనన్ని వస్తున్నాయి. ఆ చిత్రం ఏమిటో తెలుసా... సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న గుంటూరు కారం. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని ఏ ముహూర్తాన ప్రారంభించారో కానీ ఈరోజు వరకు కూడా షూటింగ్ ఏకధాటిగా జరగలేదు.
ఏ సినిమాపై రానన్ని గాసిప్స్ ఈ చిత్రంపై వస్తున్నాయి. రోజుకొకటి పుట్టుకొస్తోంది. నటుల కాల్షీట్లు దొరకడంలోనూ ఈ సినిమాకు కష్టాలే ఎదురవుతున్నాయి. వారి కాల్షీట్లు దొరక్క షూటింగ్ వాయిదాలమీద వాయిదాలు పడుతూ వస్తోంది. ఇంతలోనే ఈ చిత్రం నుంచి సంగీత దర్శకుడు తమన్ ను తొలగించారంటూ వార్త వచ్చింది అయితే గుంటూరు కారం యూనిట్ దీన్ని ఖండించింది. ఈ వార్తను మరిచిపోయేలోగా మరో వార్త హల్ చల్ చేస్తోంది. పూజాహెగ్డేను తొలగించారంటూ మరో వార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. పూజా హెగ్డేను తొలగించి సంయుక్త మీనన్ కు అవకాశం ఇచ్చారని వార్తలు వస్తున్నాయి.
దీనిపై అటు చిత్ర యూనిట్ కానీ... ఇటు పూజా హెగ్డే టీమ్ కానీ.. స్పందించలేదు. ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. విరూపాక్ష సినిమాలో సత్తా చాటిన సంయుక్త మీనన్ ను తీసుకోవాలని త్రివిక్రమ్ యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికితోడు ... ఈ సినిమా ఉందా? అటకెక్కించావా? అంటూ బండ్ల గణేష్ పరోక్షంగా త్రివిక్రమ్ గురించి ట్వీట్ చేయడం కూడా మహేష్ బాబు అభిమానుల్లో ఆందోళన పెరగడానికి కారణమైంది. మొత్తానికి గుంటూరు కారం సినిమా... విడుదలకు ముందే కారం ఘాటు రేపుతోంది. విడుదల తరువాత ఇంకెంత కారం మంట వెదజల్లుతుందో చూడాలి.
యూట్యూబ్ లైవ్
తాజా వార్తలు
Related Videos