ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదాలు ఇప్పుడిప్పుడే ఆగేలా కనిపించడం లేదు. కృష్ణా, గోదావరి నదీజలాల వినియోగం విషయంలో ఫిర్యాదులు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా కృష్ణా ట్రిబ్యునల్ లో తెలంగాణ ప్రభుత్వం పై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన ఒక పిటిషన్ విచారణ జరగ్గా ఏపీ ప్రభుత్వానికి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది.

తెలంగాణలోని పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పై ఏపీ ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్ లో దాఖలు చేసిన ఇంటర్ లొకేటరీ అప్లికేషన్ ను కృష్ణా ట్రిబ్యునల్ తోసిపుచ్చింది. గత సంవత్సరం డిసెంబర్ లో పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుకు 90 టీఎంసీల నికర జలాలను కేటాయిస్తూ తెలంగాణ రాష్ట్రం ఉత్తర్వులు జారీ చేసిన అంశంపై ఏపీ ప్రభుత్వం ... ట్రిబ్యునల్ కు ఫిర్యాదు చేస్తూ... తెలంగాణ 90 టీఎంసీల నీటిని వాడకుండా ఆపాలని అందులో పేర్కొంది. అంతేకాకుండా ఇంటర్ లొకేటరీ అప్లికేషన్ ను దాఖలు చేసింది.

ఇదే సమయంలో...ఈ అప్లికేషన్ ను విచారించే అధికారం తమకు లేదని, ఇందుకు తగిన వేదికలను ఆశ్రయించాలని కృష్ణా ట్రిబ్యునల్ ఏపీ ప్రభుత్వానికి సూచించింది. ఈ అంశం తమ పరిధిలో లేదని, సరైన ఫోరంలో తేల్చుకోవాలని చెబుతూ ట్రిబ్యునల్ ... ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన కేసును కొట్టివేయడంతో ప్రభుత్వం ఇతర మార్గాలను అన్వేషిస్తోంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos