ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు పీఏగా పని చేసిన పెండ్యాల శ్రీనివాస్ ను సస్పెండ్ చేసింది. ఈ మేరకు సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. చంద్రబాబుకు ముడుపులు అందటంలో శ్రీనివాస్ కీలకపాత్ర పోషించారని సీఐడీ అభియోగాలు నమోదు చేసింది. కేసు విచారణ సమయంలో అనుమతి లేకుండా శ్రీనివాస్ అమెరికా వెళ్లారు. నోటీసులు ఇచ్చినా తిరిగి రాకపోవటం తో సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అమరావతి నిర్మాణ సంస్థల నుంచి ముడుపులు తీసుకున్నట్లు శ్రీనివాస్ పైన అభియోగాలు ఉన్నాయి. కొంతకాలం క్రితం ఐటీ అధికారులు శ్రీనివాస్ ఇంట్లో సోదాలు చేసి... విచారణ నిర్వహించారు. ఆ సమయంలో ముడుపుల విషయంలో శ్రీనివాస్ ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా ఐటీ నోటీసులు జారీ చేసింది. చంద్రబాబుకు అందిన ఐటీ నోటీసులు, స్కిల్ స్కాంలోనూ శ్రీనివాస్ ఇచ్చిన స్టేట్ మెంట్ ను విచారణ సంస్థలు ప్రస్తావించాయి. దీంతో, స్కిల్ స్కాంలో చంద్రబాబు అరెస్ట్ వేళ శ్రీనివాస్ అనుమతి లేకుండా అమెరికా వెళ్లారు. శ్రీనివాస్‌… ప్రస్తుతం ప్లానింగ్‌ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్‌ సెక్రటరీగా ఉ‍న్నారు. విదేశాల్లో ఉన్న ఆయన సెప్టెంబర్ 29వ తేదీలోగా తిరిగి వచ్చి వివరణ ఇవ్వాలని సీఐడీ అధికారులు కోరారు.. అయినప్పటికీ ఆయన నుంచి ఎలాంటి స్పందన లేకపోవటంతో… సర్వీస్ నిబంధనలు అతిక్రమించారని పేర్కొంటూ ప్రభుత్వం శ్రీనివాస్ ను సస్పెండ్ చేసింది. కాగా.. స్కిల్ డెవలప్‌మెంట్ కేసుకు సంబంధించి ఏపీ సీఐడీ అదనపు డీజీ సంజయ్ మాట్లాడుతూ.. ఈ కుంభకోణంలో కీలక వ్యక్తిగా ఉన్న డిజైన్ టెక్‌కు చెందిన మనోజ్ పార్థసాయి కూడా విదేశాలకు పారిపోయాడని తెలిపారు. ఈ కుంభకోణంలో నిందితులు కీలక పాత్రధారులు కావడంతో వారిని తీసుకురావడానికి ఇంటర్‌పోల్ సహాయం తీసుకుంటామని కూడా తెలిపారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos