ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ విశాఖలో భారీ మొత్తంలో డ్రగ్స్ సీజ్ చేసిన ఘటన వైసిపి నేతల తలకు చుట్టుకునేలా వ్యవహారం నడుస్తోంది. ఈ క్రమంలో విశాఖలో సీజ్ చేసిన డ్రగ్స్ కంటైనర్ ఏపీ​లో ప్రకంపనలు సృష్టిస్తోంది. విశాఖ పోర్టుకు ఈ నెల 16వ తేదీన చైనా నౌక ద్వారా కంటైనర్‌ విశాఖ వచ్చినట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. అదే రోజున దిల్లీ నుంచి వచ్చిన సీబీఐ అధికారులు స్థానికంగా కస్టమ్స్‌ అధికారుల సాయంతో కంటైనర్​ను తెరిచేందుకు ప్రయత్నించారు. అయితే సీబీఐ అధికారులకు ఆటంకాలు కలించడానికి వైసీపీ నేతలు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. లక్షల కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్‌ దొరక్కుండా అడ్డుకునేందుకు శాయశక్తులా ప్రయత్నించారని సమాచారం. కంటైనర్ తెరిచి నమూనాలు సేకరించి పరీక్షించే సమయంలోనూ సీబీఐకి సహకరించాల్సిన అధికారులు అడ్డంకులు సృష్టించినట్లు తెలుస్తోంది. ఈ కంటైనర్‌ సంధ్యా ఆక్వా పేరుతో బుక్‌  అయినందున సంధ్య ఆక్వా ఎక్స్‌ పోర్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సహా, గుర్తు తెలియని మరికొందరిపైనా కేసు నమోదు చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే నిత్యం ఎక్కడో ఒకచోట గంజాయి పట్టుబడుతూనే ఉంది. గంజాయికి బానిసలుగా మారుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పుడు డ్రగ్స్​ సైతం వ్యాప్తి చెందుతుండడంతో మరింత ఆందోళన కలిగిస్తోంది. వీటన్నింటికీ జగన్‌ ప్రభుత్వమే కారణమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విశాఖ పోర్టు చరిత్రలోనే ఇంత భారీస్థాయిలో డ్రగ్స్‌ పట్టుబడడం పోర్టు వర్గాలను కుదిపేస్తోంది. నిషేధిత డ్రగ్స్‌ ఖరీదు గ్రాముల్లోనే వేలల్లో ఉంటుంది. అలాంటిది 25 వేల కిలోల విలువ ఎంత ఉంటుందో అనేది తేలాల్సి ఉంది.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos