రాష్ట్రంలో రాబోయే మూడు నెలల్లో రైతురాజ్యం వస్తుందనీ... అమరావతే రాజధానిగా ఉంటుందని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. పొరుగున ఉన్న హైదరాబాద్‌ వెలిగిపోతుంటే, అమరావతి మాత్రం వెలవెలబోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తేనే ఆదాయం సమకూరుతుందని.. ఉపాధి కల్పన ఉంటుందని చెప్పారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో 'రా.. కదలిరా..' పేరుతో చంద్రబాబు జిల్లాకో బహిరంగ సభ జరిగింది. ఇందులో భాగంగా ఆదివారం ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరులో, సాయంత్రం పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో బహిరంగ సభల్లో ప్రసంగించారు. తొలుత ఉదయం తిరువూరు సభ లో మాట్లాడుతూ రాష్ట్రానికి రాజధాని ఏదని అడిగితే సమాధానం చెప్పుకోలేని పరిస్థితిని జగన్ తీసుకొచ్చారని ధ్వజమెత్తారు. మూడు రాజధానుల పేరుతో విశాఖకు వెళ్లడానికి ప్రయత్నిస్తే ఎక్కడికీ వెళ్లొద్దని కోర్టు మొట్టికాయలు వేసిన విషయాన్ని గుర్తుచేశారు. త్వరలోనే మన రాజధాని అమరావతి అని గర్వంగా చెప్పుకొనే పరిస్థితి వస్తుందని స్పష్టం చేశారు. అధికారంలో నుంచి సైకో పోవాలన్నది తన కోరిక కాదని, అది ప్రజల కోరికని చెప్పారు. జగన్‌ రివర్స్‌ పాలనతో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని కోలుకోలేని దెబ్బతీశాడని ధ్వజమెత్తారు. 'రా.. కదలిరా..' కార్యక్రమం తన కోసమో, పవన్‌ కోసమో, లోకేశ్‌ కోసమో కాదని.. రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజల కోసమని స్పష్టం చేశారు. ఒక వ్యక్తి కారణంగా 5 కోట్ల మంది జనాభా ఒక తరాన్ని నష్టపోవడం దేశంలో ఎక్కడా జరగలేదని అన్నారు. అనంతరం సాయంత్రం పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో  నిర్వహించిన సభ లో మాట్లాడుతూ సీఎం జగన్ కు చంద్రబాబు ఒక సవాల్ విసిరారు. జగన్ కు దమ్ముంటే నేను చెప్పిన ఎమ్మెల్యేలను మార్చగలరా అని ఛాలెంజ్ చేశారు. ఆచంట, తణుకు, తాడేపల్లి, భీమవరం, నరసాపురం ఎమ్మెల్యేలను మార్చే ధైర్యం నీకు ఉందా జగన్ అని ఛాలెంజ్ చేశారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos