దేశంలోనే ప్రసిద్ధి గాంచిన ఢిల్లీ, కోల్ కతా, కేరళ రాష్ట్రాల్లో నిర్వహించే పుస్తక మహోత్సవాలకు దీటుగా ఏపీ రాష్ట్రంలోని విజయవాడ పుస్తక మహోత్సవానికి ఎంతో పేరుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతోమంది సాహిత్య అభిమానులు, పుస్తక ప్రియులు అధిక సంఖ్యలో తరలివస్తుంటారు. గతంలో జనవరి ఒకటో తేదీన ప్రారంభించే మహోత్సవాలను కరోనా తరువాత గత రెండేళ్ల నుంచి డిసెంబరులోనే ప్రారంభిస్తున్నారు. ఇప్పటివరకు విజయవాడ నగరం నడిబొడ్డులోని స్వరాజ్య మైదానంలో స్టాళ్లు ఏర్పాటు చేసేవారు. ప్రస్తుతం అక్కడ అంబేడ్కర్ స్మృతివనం పనులు కొనసాగుతుండడంతో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణానికి మార్చారు. ఈ వేదిక జాతీయ రహదారి పక్కనే ఉన్నా... నగరానికి చివరన ఉండడంతో వన్ టౌన్, ఆపై ప్రాంతాల నుంచి వచ్చేవారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పుసక్త ప్రదర్శన సందర్భంగా ఈ 11 రోజులపాటు సిటీ సర్వీసులు మరిన్ని నడిపితే ఎక్కువ మంది ప్రదర్శన తిలకించే అవకాశం ఉంటుంది. నిర్వాహకులు పుస్తక ప్రదర్శన కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్ ను ఆవిష్కరించి వివరాలు వెల్లడించారు. వాయిస్ ..ఈ రోజు సాయంత్రం 6 గంటలకు పుస్తక మహోత్సవాలను కేంద్ర సాహిత్య అకాడమీ చైర్మన్ మాధవ్ కౌషిక్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. అనంతరం కేతు విశ్వనాథరెడ్డి సాహిత్య వేదికపై వరహాలశెట్టి సంస్కరణ సభ, మేజిక్ షో నిర్వహించారు.  రేపు 29వ తేదీన సంజీవ్ దేవ్  శతజయంతి సభ, ఓల్గా, వెన్నా వల్లభరావు పుస్తకాల ఆవిష్కరణ, 'కథ చెప్పండి' పోటీలు నిర్వహిస్తారు. 30న 'జనాభా సంఖ్య-అపోహలు- భారత రాజకీయాలు' అంశంపై సదస్సు, సైన్స్ ప్రాజెక్టుల ప్రదర్శన కార్యక్రమాలు ఉంటాయి. 31న కాళీపట్నం రామారావు శతజయంతి సభ ఉంటుంది. జనవరి 1న సాయంత్రం పుస్తక ప్రియుల పాదయాత్రను జస్టిస్ జాస్తి చలమేశ్వర్ జెండా ఎగురవేసి ప్రారంభిస్తారు. 2న అవంత్స సోమ సుందర్ శత జయంతి సభ, సాహితీ స్రవంతి పుస్తకాల ఆవిష్కరణ, విద్యార్థులకు వక్తృత్వ పోటీలు నిర్వహిస్తారు. 3న నేషనల్ బుక్ ట్రస్ట్ వారి పిల్లల పుస్తకాల ఆవిష్కరణ, లైఫ్ సేవింగ్ స్కిల్స్ పోటీలు ఉంటాయి. 4న సోమేపల్లి వెంకట సుబ్బయ్య సంస్కరణ సభ, ప్రజాశక్తి బుక్ హౌస్ పుస్తకాల ఆవిష్కరణ, పద్యాల పోటీలు జరుగుతాయి. 5న రాంభట్ల కృష్ణమూర్తి శత జయంతి సభ, క్రియేటివ్ రైటింగ్ కార్యశాల, క్విజ్ పోటీలు ఉంటాయి. 6న ప్రజాశక్తి పుస్తకాల ఆవిష్కరణ, క్విజ్ పోటీలు నిర్వహిస్తారు. 7న జరిగే ముగింపు వేడుకలకు నటులు తనికెళ్ల భరణితోపాటు పలువురు ఉన్నతాధికారులు, ప్రముఖులు హాజరవుతారు. వీటితోపాటు ఆయా రోజుల్లో పలు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించనున్నారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos