ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ టీడీపీ - జనసేనతో కలిసి వెళ్లేందుకు బీజేపీ అడుగులు వేస్తున్న క్రమంలో జనసేన అధినేత ప్రధాని మోడీకి ఓ కీలక అంశంపై లేఖ రాశారు. ఈ లేఖలో ఆయన ప్రస్తావించిన అంశాలు పాతవే అయినా ఇప్పటివరకూ వాటిని బీజేపీ నేతలు ఎక్కువగా ఫోకస్ చేశారు. కానీ ఇప్పుడు పవన్ కూడా అదే విషయాలను ప్రస్తావిస్తూ కేంద్ర సంస్ధలతో దర్యాప్తు కోరడం... ఏకంగా ప్రధానికే లేఖ రాయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఏపీ లో పేద ప్రజలకు నిర్మించి ఇచ్చే ఇళ్ల ప్రాజెక్టులో భారీ కుంభకోణం జరిగిందని ... ఈ ఇళ్ల నిర్మాణం, పట్టాల పంపిణీపై ప్రభుత్వం రోజుకో ప్రకటన చేస్తోందని ... భూ సేకరణలో వైసీపీ ఎమ్మెల్యేలు కీలకంగా వ్యవహరించారని...  ఇందులో భారీగా అక్రమాలు జరిగాయని పవన్ కల్యాణ్ ఆరోపించారు. కేంద్రం జోక్యం చేసుకుని సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన లేఖలో కోరారు. ఐదు పేజీల ఈ లేఖలో జగన్ సర్కారుపై పవన్ పలు ఆరోపణలు గుప్పించారు. ఏపీలో 2019 జూన్ నుంచి ఇళ్ల స్ధలాల పంపిణీ, జగనన్న కాలనీల నిర్మాణం పేరుతో వైసీపీ ప్రభుత్వం వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిందని పేర్కొన్నారు. ఇందులో ఇళ్ల స్ధలాల పంపిణీ కోసం ప్రభుత్వం చేపట్టిన భూసేకరణలో రూ.32,141 కోట్ల అక్రమాలు జరిగాయని ... ఈ వ్యవహారంపై అధికార వైసీపీ ప్రజాప్రతినిధే విజిలెన్స్ దర్యాప్తు కోరినట్లు పవన్ తెలిపారు. కానీ ప్రభుత్వం ఈ ఫిర్యాదును పట్టించుకోలేదన్నారు. ఇళ్ల స్ధలాల కోసం సేకరించిన భూముల ధరల్ని ఎడాపెడా పెంచేసి భూములిచ్చిన యజమానులకు తక్కువ ధరలు చెల్లించి మిగతా డబ్బులు వైసీపీ నేతలు జేబుల్లో వేసుకున్నారని పవన్ ఆరోపించారు. ఈ మొత్తం ప్రాజెక్టు విలువే రూ.1.75 లక్షల కోట్లు ఉంటే ... ఈ ఏడాది అక్టోబర్ నాటికి 91 వేల కోట్లు చెల్లించినట్లు ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం ప్రధానమంత్రి ఆవాస్ యోజన అమలు జరుగుతుంటే వైసీపీ ప్రభుత్వం మాత్రం ఇళ్ల పథకం తమదేనని చెప్పుకుంటోందన్నారు. వైసీపీ ప్రభుత్వం పేదలందరికీ ఇళ్లు పథకం ద్వారా 30 లక్షల ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చిందని, ఇందులో భాగంగా రూరల్ లో సెంటు, అర్బన్ ప్రాంతాల్లో సెంటున్నర చొప్పున 29.51 లక్షల మంది లబ్ధిదారులకు వీటిని ఇవ్వాల్సి ఉందన్నారు. వీటిలో 21.87 లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలు ఇచ్చారని, ఇందుకోసం 28,445 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇళ్ల స్ధలాలుగా మార్చారని, మరో 25,374 ఎకరాల్ని ప్రైవేటు వ్యక్తుల నుంచి సేకరించారన్నారు. ఈ గణాంకాల్లో ఎక్కడా పొంతనలేదని పవన్ కళ్యాణ్ ... ప్రధాని మోడీకి రాసిన లేఖలో వివరాలు పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో వేల కోట్ల ప్రజాధనం వైసీపీ నేతల జేబుల్లోకి వెళ్లిందన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ఏమార్చి వైసీపీ సర్కార్ అమలు చేస్తున్న పథకాల వల్ల ఎంత ప్రజాధనం దుర్వినియోగం అయ్యిందో తేల్చేందుకు కేంద్ర సంస్ధలతో దర్యాప్తు చేయించాలని పవన్ కళ్యాణ్ ప్రధాని మోడీని కోరారు.

యూట్యూబ్ లైవ్

LIVE : Minister Nara Lokesh Participates in Shining Stars Talent Awards Function | Amaravati Galam

తాజా వార్తలు

15-30-56-0856.jpg

విశాఖలో ఐబీఎం( IBM ) ఫ్యూచర్ నౌ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్.. 
2026-08-05 Time: 03:30:56

17-16-20-0720.jpeg

విజయవాడ రూరల్ లోని 9 గ్రామాలను వీఎంసీలో విలీనం చేయడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
2026-07-31 Time: 05:16:20

14-33-24-0724.jpg

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్య‌మే ప్రజాస్వామ్యానికి అస‌లైన బ‌లం.. ఓట‌ర్ల అర్హ‌త‌,  అత్యుత్త‌మ విధానాల‌పై అంతర్జాతీయ వ‌ర్క్‌షాప్‌లో వ్యక్తలు 
2026-07-22 Time: 02:33:24

14-31-49-0749.jpg

మ‌హిళా సాధికారిత‌లో మ‌రో కీల‌క అడుగు..  భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో స్వ‌యం బ్రాండ్ స్టాల్ ఏర్పాటుకు విజ్ఞ‌ప్తి
2026-07-22 Time: 02:31:49

18-08-25-0725.jpg

ఏపీలో యూఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు నాంది.. సీఎం చంద్రబాబు, యూఏఈ మంత్రి అబ్దుల్లాబిన్ తౌక్ అల్ మర్రీ  సమక్షంలో ఎంఓయూ
2026-07-21 Time: 06:08:25

Related Videos